రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద అక్టోబరు 5వ తేదీన నిధులను విడుదల చేయబోతుంది. అర్హులైన రైతులందరికి వారివారి ఖాతాలలోకి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌ (డిబిటి) రూపంలో దీనిని కేంద్రప్రభుత్వం జమ చేయనుంది. ఈ విధానంలో లబ్దిదారులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులను జమ చేయడం వల్ల ఏలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబరుకు మెసేజ్‌ అందుతుంది.