కొబ్బరిపాలు + పుల్ల మజ్జిగ…|

పంట పెట్టడం ఒకెత్తయితే… అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూటారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారుచేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్స్, జిబ్బరిల్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని, ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి, వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నర్రెంగ మొక్కలు దొరకకపోతే మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి… ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టుకోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.

Read More

ఔషధ మొక్క…. మాచిపత్రి

మాచిపత్రి నేలబారుగా పెరిగే నిటారైన శాఖలు గల బహువార్షిక మొక్క. ఆకులు చామంతి ఆకుల వలే ఉండి, కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. అంచుల నుండి ఈనెల వరకు వివిధ పరిమాణాలలో నొక్కులు కలిగి ఉంటాయి. పూవులు పసుపుఛాయ కలిగి అతి చిన్న ముద్ద వలె ఏర్పడతాయి. దీనిని పిలక మొక్కలు మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు.

సాధారణ నామం : ఇండియన్ వర్మ్‌వుడ్ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా వుల్గారిస్ కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
  • ఆకులలో ఆవిరయ్యే నూనె, సెస్క్యిటెర్పిన్స్, లాక్టోన్స్, ఫ్లేవనాయిడ్స్, కౌమారిన్స్, ట్రైటెర్పిన్ మొదలైన రసాయనాలుంటాయి.
  • మాచిపత్రి వాతం, చర్మవ్యాధులు, కంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
  • దీనిని వీర్యవృద్ధికి, క్రిమిసంహారిణిగా, కడుపునొప్పి, ఉబ్బసం, నరాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • మహిళలు ఋతుక్రమాన్ని సక్రమంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఆకలిని వృద్ధి చేయడానికి, మలేరియా నివారణకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • మాచిపత్రి (ఆర్టెమిసియా జుడైకా) ఎసెన్షియల్ ఆయిల్ అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా కీటకనాశక చర్య ద్వారా నివారించింది (అబ్డఎల్‌హాడి, 2012).
  • మాచిపత్రి (ఆర్టెమిసియా వుల్గారిస్) ఆకు (1500 పిపియం) మరియు పూల (4000 పిపియం) క్రూడ్ ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 3, 4 వ దశ లార్వాలపై బలమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ దోమకాటుకు అధిక స్థాయిలో రక్షణ కల్పించింది (మాంగ్ మాండ్ మైయ, అతని అనుచరులు, 2016).
  • మాచిపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, రైజోపెర్తా డామినిక, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లను ప్యూమిగెంట్ విష చర్య ద్వారా నివారించింది (షారిఫియాన్, అతని అనుచరులు, 2012).
  • మాచిపత్రి (ఆర్టెమిసియా స్కోపారియా) ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. ఈ ఫలితాలు సేంద్రియ ఆహార ఉత్పత్తిలో మాచిపత్రి సామర్థ్యాన్ని నిరూపించాయి (నెగాబాన్, అతని అనుచరులు, 2006).
  • మాచిపత్రి కాండం నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి లార్వాలను తక్కువ మోతాదులో సమర్ధవంతంగా అరికట్టింది (సుజాత అండ్ రంజిత, 2013).
  • ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 500 ఆర్టెమిసియా జాతులున్నాయి. ఆర్టిమిసియా హెర్బాఆల్బా, ఆర్టెమిసియా ఆబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైబోలియం కాస్టానియం, ఒరైజోఫిలస్ సురినానెన్సిస్ పెద్ద పురుగులపై విష చర్యను ప్రదర్శించాయి (జెమా, 2014)
  • ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ ద్రాక్ష పండ్లను ఆశించి కుళ్ళజేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ శిలీంద్రాల పెరుగుదలను 100% అరికట్టింది. ఆయిల్ అఫ్లాటాక్సిన్, ఆక్రాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌ని అరికట్టింది. మైకోటాక్సిన్ స్రవాన్ని పూర్తిగా అరికట్టింది. ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే 1కి. ద్రాక్ష పండ్లను ఈ శిలీంద్రాల నుండి కాపాడి నిల్వ కాలాన్ని 9 రోజులు పెంచింది (సోంకర్, అతని అనుచరులు, 2015)
  • ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ రైజోక్టోనియా సొలాని, స్ల్కీరోషియం రాల్ఫ్సి, మాక్రోఫోమినా ఫేసియోలినా వంటి పంట…లో వేరుకుళ్ళు కలిగించే శిలీంద్రాలను అరికట్టింది. ఈ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆర్టెమిసియా సీరూలెసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్, ఆల్టర్నేరియా, ఫ్యుజేరియం శిలీంద్రాలను అరికట్టింది (పెట్రెట్టో, అతని అనుచరులు, 2013; స్టాప్పెన్, అతని అనుచరులు, 2014).
  • ఆర్టిమిసియా అబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్ఫోరం, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013)
  • అర్టిమిసియా డ్రాకన్‌క్యులస్ ఎసెన్షియల్ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013).
  • అర్టెమిసియా జుడైకా ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన ట్రాన్సఇథైల్ సిన్నమేట్, పైపర్‌టోన్‌కన్నా శక్తివంతంగా స్పొడోప్టెరా లిట్టురాలిస్‌ని పూర్తిగా తిండి తినకుండా చేసింది (అబ్డెల్లలీల్, అతని అనుచరులు, 2008).
  • మాచిపత్రి ద్రావణం ట్రైబోలియం కాస్టానియం లార్వాలను అత్యధిక శాతంలో చంపింది. (పుగజ్‌వెండన్, అతని అనుచరులు, 2012).
  • మాచిపత్రి ఆకు మిథనాల్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను వేరు, కాండం ద్రావణాల కన్నా గణనీయంగా అధికంగా చంపాయి (ఇలాహి అండ్ ఉల్లా, 2013)
  • మాచిపత్రి ఆకునీటి ద్రావణం (10%) తేయాకు పంటలో ఎర్రనల్లి కలిగించే నష్టాన్ని తగ్గిస్తుంది (మామున్ అండ్ అహ్మద్, 2011)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క మురిపిండ

మురిపిండ / కుప్పింట / హరిత మంజరిగా పిలువబడే హరిత మంజరి ఏకవార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక కలుపు మొక్కగా అన్ని చోట్లా కన్పిస్తుంది. దీని పూలగుత్తులు కప్పులాంటి ఆకారంలో కప్పబడి ఉంటాయి. పూలు అతి చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్క నిటారుగా 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క 1.2-6.55þ14 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకు మొదలు గుండ్రంగా ఉంటుంది. ఆకుకాడ 1.5 నుండి 5.5 సెం.మీ. పొడవుంటుంది. పూలకాడలు 2.5 నుండి 6 సెం.మీ. పొడవుంటాయి. పూలకాడ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగులో ఆడపూలు ఉంటాయి. కాండం పొడవునా దళసరి ఈనెలలో నూగు కలిగి ఉంటుంది. కాయ 1.5þ2 మి.మీ. పరిమాణంలో 3 చీలినట్లున్నభాగాలతో నూగు కలిగి ఉంటుంది. మురిపిండ ఒక మీటరు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. ఆకులు దాదాపు వృత్తాకారంలో ఉండి, కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకు అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా మొక్కపై ఏర్పడతాయి. మురిపిండ మొక్కలు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిపై మొలకెత్తి వర్షాకాలంలో ఏపుగా పెరుగుతాయి. ఇవి పంటపొలాలలోను, బీడు భూములలోను, కంచెల వెంబడి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. మురిపిండ మొక్కలో అకాలైఫిన్, అరంటియమైడ్, కాన్నాబినాల్, ఫ్లేవకెంఫెరాల్, సక్సినిమైడ్ వంటి అనేక రసాయనాలుంటాయి.

సాధారణ నామం : ఇండియన్ అకలైఫా / ఇండియన్ నెటిల్ / ఇండియన్ కాపర్ లీఫ్ శాస్త్రీయ నామం : అకలైఫా ఇండికా కుటుంబం: యూఫర్బియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కుప్పింట అనేక సంప్రదాయ ఔషధ ప్రయోజనాలు కలిగి, వాంతిమందుగా, విరేచనకారిగా, నులిపురుగుల నివారిణిగా, గజ్జి నివారిణిగా ఉపయోగపడుతుంది.
  • నూరిన ఆకుల రసానికి ఉప్పు కలిపి లేదా కషాయంగా తీసుకుని గజ్జి చర్మవ్యాధులను నివారించుకోవచ్చు. దీని కషాయం ఆస్త్మా చికిత్సకి, కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
  • వేరు కషాయం విరేచనకారిగా పని చేస్తుంది.
  • ఆకులను కంటి జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకుపొడిని గాయాల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • భారతదేశంలో కుప్పింటని ఉబ్బసం, న్యుమోనియా చికిత్సకుపయోగిస్తారు. ఆఫ్రికా, ఇండియాలలో దీని ఆకులను కూరవండుకుని తింటారు.

వ్యవసాయరంగంలో …

  • కుప్పింట యాంటిఆక్సిడెంట్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటిఅల్సర్, యాంటిహెల్మింటిక్, యాంటిక్యాన్సర్, యాంటివీనోమ్ చర్యలు కలిగి ఉంది (సుధాకర్, అతని అనుచరులు, 2016).
  • కుప్పింట మిథనాల్ ద్రావణాలు పంటలలో తెగుళ్ళు కలిగించే గ్జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా అరికట్టింది (జాన్ డిబ్రిట్టె, అతని అనుచరులు, 2011).
  • కుప్పింట కాండం, బెరడు ద్రావణాలు మిడత, ఎపాక్రోమియా స్పీ. పై విషచర్యను ప్రదర్శించింది. (పుట్టరుద్రయ్య అండ్ భాటియా, 1955).
  • కుప్పింట బెరడు, ఆకుపొడులు, వాటి ఇథనాల్ ద్రావణాలు గొంగళిపురుగు, యూప్రోక్టిస్ ఫ్రెటిర్నా మరియు డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (మెకిండూ, 1983).
  • కుప్పింట మొక్కలు పంటలలో శత్రు పురుగుల సహజ జీవనియంత్రణ కారకాలైన మిత్ర పురుగులకు ఆశ్రయమిస్తాయి (టిఎనఎయు అగ్రిటెక్‌పోర్టల్) కుప్పింట మొక్క భూమిలోని విషపూరిత లోహాలైన సీసం (లెడ్), నికిల్, క్రోమియం, కాడ్మియంలను గ్రహించి నిల్వ చేసుకుంటుంది. అందువలన ఈ లోహాలతో కలుషితమైన భూముల నుండి వీటిని తొలగించడానికి ఈ మొక్కను సిఫారసు చేయవచ్చు. (సుభాషిణి అండ్ స్వామి, 2015)
  • ఈ మొక్కలో ఉన్న “కన్నాబినాల” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. వీటి ఆకులను ‘పంచపత్ర కషాయం’ తయారీలో ఉపయోగించవచ్చు.
  • ఈ కషాయాన్ని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్పర్శ చర్య, ఉదర చర్య కలిగి ఉంటుంది. అందువలన ఈ కషాయం ఒక శక్తివంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది.
  • మురిపిండ ఆకు కషాయం (10 శాతం) ఆల్టర్నేరియా హీలియాంథి (ప్రొద్దుతిరుగుడు ఆకుమాడు తెగులు) శిలీంద్రం పెరుగుదలను (78.38%), బీజోత్పత్తిని (85.90%), బీజాలు మొలకెత్తడాన్ని (52.48%) నివారించింది.
  • వీటి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శిలీంద్ర నాశని లక్షణాలు కూడా ఉన్నాయి (జయకుమార్ సోలమన్, తమిళనాడు).
  • దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఈ కషాయానికుందని కెల్మ్ (1997) పరిశోధనలు తెలియజేశాయి. పత్తి పంటలో ఆకులను తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు.
  • మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి కనుక ఈ కషాయాన్ని పంటలపై పిచికారి చేస్తే, దీనిలోని రసాయనాలు కీటకాలకు ఆహార భక్షక నిరోధకాలుగా పనిచేస్తాయి (రఘునాథ్).
  • శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్ కుప్పింట మొక్కనుపయోగించి బహుళ పంటలలో విస్తృతంగా ఉపయోగించే వ్యవసాయ పురుగుమందుని తయారు చేశారు. దీని తయారీకి కావలసిన మొక్కల పదార్థాలు : పసుపు, వేప, మిరప, అల్లం, ఉల్లి, జిల్లేడు (కలోట్రాపిస్ జైగాంటియా, కలోట్రాపిస్ ప్రోసెరా), బొప్పాయి, కానుగ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, కుప్పింట, ఆముదం, సింబోపోగాన్ సిట్రేటస్, ఆముదం మొక్క, సదాపుష్ప (కాథరాంతస్ రోసియస్), గన్నేరు. వావిలి, ఉల్లి, మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి చెట్టు, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
  • ఈ పురుగుమందు అనేక పంటలలో పురుగులను సంహరిస్తుంది. మొక్కలలో పురుగులు, తెగుళ్ళు, వైరస్‌ల నిరోధకశక్తిని పెంచుతుంది. తెగులుకారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. శిలీంద్రాలు, లార్వాలు, క్రిములు, బాక్టీరియా, నులిపురుగులు, గుల్లలు, నత్తలను చంపుతుంది. దీనినుపయోగిస్తే ఇంకే పురుగుమందును వాడవలసిన అవసరం లేదు.
    మోతాదు : 3% (30 మి.లీ./లీ.) పురుగుమందు పిచికారి చేయాలి., ఎకరానికి 35 లీ. ఒకసారి పిచికారి చేయడానికి ఉపయోగించాలి.
    నిల్వ కాలం : 3 సంవత్సరాలు
  • కుప్పింట ఆకుల పొడి నీటి ద్రావణం (0.05 గ్రా./లీ.) టమాట కాయనాశించే బాక్టీరియం, క్ౙాంతోమోనాస్ వెసికటోరియాపై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (అడెడైర్, అతని అనుచరులు, 2017).
  • 5% కుప్పింట బెరడు ఆల్కహాల్ ద్రావణం 98% ప్లూటెల్లా మాక్యులిపెన్నిస్ మరియు పెరికేలియా రిసిని, 50% ప్రొడీనియాలిటూర, 40% క్రోసిడిలోమియా బైనొటాలిస్, 100% యూప్రూటిస్ ఫ్రెటర్నా లార్వాలను చంపింది. (పుట్టురుద్రయ్య అండ్ సుబ్రమణియన్, 1958).
  • కుప్పింట మొక్కలో టానిన్స్, టెర్పెనాయిడ్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కుప్పింట ద్రావణం వేరుశనగ పంట నాశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం శిలీంద్రాల పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (రాధిక, ఆమె అనుచరులు, 2016).
Read More

‘జీవామృతం’ తో జవజీవాలు

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

  • 200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
  • 10 కిలోల పేడ (నాటు ఆవు)
  • 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
  • 2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
  • 2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
  • పొలం గట్టు మట్టి…పిడికెడు

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:
ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా…
3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).
6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):
మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.
జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.

Read More