ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరలు రద్దు
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఊతం ఇచ్చి రైతులు ఆదాయం పెరిగేందుకు వీలుగా ఉల్లి మరియు బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించినట్లు కేంద్ర పేర్కొంది.

