వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో ఇంధన ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం దాని లక్ష్యం. ఇది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 57 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడను ఇంధన ఉత్పత్తికి ఉపయోగిస్తారు కాబట్టి రైతులకు అదనపు ఆదాయ మార్గం కాగలదు.

