నాబార్డ్‌ తెలంగాణ సీజీఎంగా బి. ఉదయ్‌ భాస్కర్‌

శ్రీ బి ఉదయ్‌ భాస్కర్‌ 01 అక్టోబర్‌ 2024న నాబార్డ్‌, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం యొక్క చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (CGM)గా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ ఉదయ్‌ భాస్కర్‌కు డెవలప్మెంట్‌ బ్యాంకింగ్‌లో 31 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. ఆయన బాపట్ల వ్యవసాయ కళాశాల, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ANGRAU)లో వ్యవసాయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేశారు.
1993లో కర్ణాటక రాష్ట్రంలో నాబార్డ్‌లో చేరిన శ్రీ ఉదయ్‌ భాస్కర్‌ జార్ఖండ్‌, కర్ణాటక, APలోని ప్రాంతీయ కార్యాలయాలు మరియు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన నాబార్డ్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌, రీఫైనాన్స్‌, క్రెడిట్‌ ప్లానింగ్‌, వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, MSME సెక్టార్‌, గ్రామీణ సహకార సంస్థల అభివృద్ధి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, తదితర రంగాలలో వివిధ రకాలైన పోర్ట్‌ఫోలియోలను వివిధ ఉన్నత స్థానాల్లో నిర్వహించారు.
ఆయన నాబార్డ్‌, వరంగల్‌ (పూర్వం AP) లో జిల్లా అభివృద్ధి అధికారిగా (DDM) కూడా పనిచేశారు. జిల్లాలో వాటర్‌షెడ్‌ మరియు గిరిజన అభివృద్ధి ప్రాజెక్టుల అమలు, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) స్థాపన మరియు అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత అభివృద్ధి, SHG- బ్యాంక్‌ లింకేజ్‌ ప్రోగ్రామ్‌ వంటి మహిళా సాధికారత కార్యక్రమాలు, ఆర్ధిక సమ్మేళనం, మొదలైన అనేక కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు.

Read More

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల మార్గదర్శి ‘రైతునేస్తం ఫౌండేషన్‌’

ఆంధ్రప్రదేశ్‌ నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఆర్‌. గోపాల్‌

మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం మరియు రైతులకు వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం. మన దేశ జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండో వైపు మన దేశ ప్రధాన రంగమైన వ్యవసాయంలో రైతులు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఈ రెండు సమస్యలకు తన వంతు పరిష్కారం చూపించడంలో రైతునేస్తం ఫౌండేషన్‌ మార్గదర్శిగా ఉందని మే 5న రైతునేస్తం ఫౌండేషన్‌ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్‌ నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఆర్‌. గోపాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంటల సాగులో పెట్టుబడులు పెరిగి రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. దానికి సంబంధించి రైతులు రసాయన వ్యవసాయాన్ని వదిలి సేంద్రియబాట పట్టగలిగితే పెట్టుబడులు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన దిగుబడులు లభిస్తాయి. సేంద్రియ సాగు విధానానికి సంబంధించిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు మరియు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా తిలకించారు. వీటితో పాటు దేశీయ జాతి గోవులతో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించి గోవ్యర్ధాలను ఏ విధంగా వ్యవసాయంలో వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగే వివిధ ఉత్పత్తులను ఉదాహరణకు గోవ్యర్ధాలతో పిడకలు, ప్రమిదలు లాంటి  ఉప  ఉత్పత్తులు, కట్టెగానుగతో నూనె చేసే ప్రక్రియను, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన యంత్రపరికరాలైన బిస్కెట్ల తయారీ యంత్రాన్ని, టమోటా సాస్‌ తయారు చేసే ప్రక్రియను, చిరుధాన్యాల ప్రొసెసింగ్‌ యంత్రాలను, చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు తయారుచేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా మరియు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోపడే తేనెపెట్టెలను, పుట్టగొడుగుల తయారీ యూనిట్‌ను ప్రత్యక్షంగా సందర్శించి రైతులకు మరియు నిరుద్యోగులకు రైతునేస్తం ఫౌండేషన్‌ అందించే సేవలను అభినందించారు.

Read More