నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల మార్గదర్శి ‘రైతునేస్తం ఫౌండేషన్’
ఆంధ్రప్రదేశ్ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్. గోపాల్
మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం మరియు రైతులకు వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం. మన దేశ జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండో వైపు మన దేశ ప్రధాన రంగమైన వ్యవసాయంలో రైతులు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఈ రెండు సమస్యలకు తన వంతు పరిష్కారం చూపించడంలో రైతునేస్తం ఫౌండేషన్ మార్గదర్శిగా ఉందని మే 5న రైతునేస్తం ఫౌండేషన్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్. గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంటల సాగులో పెట్టుబడులు పెరిగి రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. దానికి సంబంధించి రైతులు రసాయన వ్యవసాయాన్ని వదిలి సేంద్రియబాట పట్టగలిగితే పెట్టుబడులు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన దిగుబడులు లభిస్తాయి. సేంద్రియ సాగు విధానానికి సంబంధించిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు మరియు పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా తిలకించారు. వీటితో పాటు దేశీయ జాతి గోవులతో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించి గోవ్యర్ధాలను ఏ విధంగా వ్యవసాయంలో వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగే వివిధ ఉత్పత్తులను ఉదాహరణకు గోవ్యర్ధాలతో పిడకలు, ప్రమిదలు లాంటి ఉప ఉత్పత్తులు, కట్టెగానుగతో నూనె చేసే ప్రక్రియను, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన యంత్రపరికరాలైన బిస్కెట్ల తయారీ యంత్రాన్ని, టమోటా సాస్ తయారు చేసే ప్రక్రియను, చిరుధాన్యాల ప్రొసెసింగ్ యంత్రాలను, చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు తయారుచేసే విధానాలను ప్రత్యక్షంగా తిలకించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా మరియు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోపడే తేనెపెట్టెలను, పుట్టగొడుగుల తయారీ యూనిట్ను ప్రత్యక్షంగా సందర్శించి రైతులకు మరియు నిరుద్యోగులకు రైతునేస్తం ఫౌండేషన్ అందించే సేవలను అభినందించారు.

