ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు నష్టపోకూడదనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు హెక్టారుకు రూ.50 వేల చొప్పున ప్రకటించారని, ఉల్లి రైతులకు త్వరలో ఆర్థికసాయం అందిస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో మొత్తం 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల లబ్ది కలగనుందని పేర్కొన్నారు. క్వింటాలు ఉల్లి రూ.1,200 చొప్పున మార్కెటింగ్‌ శాఖ, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.18 కోట్ల విలువైన సరకు కొనుగోలు చేశామని, ఇప్పటికి రూ.10 కోట్లు చెల్లించామని వివరించారు. మిగిలిన రూ.8 కోట్లు త్వరలో అందిస్తామన్నారు.