జలధారతో కరవు తీరింది
కరవుతో ఇబ్బందులు ఎదుర్కొనే అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోని రైతులు ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జలధారలో భాగంగా హంద్రీనీవా నీటిని వెలిగల్లు జలాశయానికి మళ్లించడంతో పాటు చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సుమారు 900 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో టమాటా, ఇతర కూరగాయలు పండిస్తు న్నారు. డ్రోన్తో ఫొటో తీసిన క్రమంలో మల్చింగ్ పేపర్లతో ఆ ప్రాంతమంతా ఈ విధంగా కనిపించింది.



