జాతీయ పురస్కారం అందుకున్న పార్వతీపురం శాస్త్రవేత్త

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. వైకుంఠపు పాపారావుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఐసీఏఆర్‌ స్థాపన దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

Read More

వ్యవసాయ పరిశోధన సంచాలకుడు బలరామ్‌ ఆవిష్కరించిన హైబ్రిడ్‌ వరి విత్తనోత్పత్తికి మూడు దేశాల పేటెంట్‌

హైబ్రిడ్‌ వరి పరిశోధనలో నూతన ఆవిష్కరణకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు మరాఠి బలరామ్‌ మూడు దేశాల పేటెంట్లను పొందారు. ఇప్పటికే ఆయనకు భారత్‌తోపాటు అమెరికాలో పేటెంట్‌ లభించింది. తాజాగా ఫిలిప్పీన్స్‌ నుంచి పేటెంట్‌ పొందారు. బలరామ్‌ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)లో ఫెలోషిప్‌ సందర్భంగా పరిశోధన చేపట్టారు. ఆఫ్రికాలో ఏడాదికి పైగా పండే వరి పంట రకాన్ని తీసుకొని దాని జీవకణాన్ని మరో మొక్కతో పరపరాగ సంపర్కం ద్వారా కొత్త హైబ్రిడ్‌ రకాన్ని కనుగొన్నారు. దీనికి 2020లో అమెరికా పేటెంట్‌ లభించగా.. 2023లో భారత్‌లో పేటెంట్‌ వచ్చింది. తాజాగా బుధవారం ఆయనకు పేటెంట్‌ను మంజూరు చేస్తూ ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ధ్రువీకరణపత్రాన్ని పంపింది. 2036 జూన్‌ 5 వరకు దీని కాలపరిమితి ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు ఆయనను అభినందించారు.

Read More