వండని వంట… పచ్చిమిర్చి పచ్చడి
పచ్చిమిర్చిని కూరల్లో కారం కోసం వాడతాం కదా. కానీ, ఒక కూరగాయగా కూడా వాడుకోవచ్చు.
పచ్చిమిర్చిని తింటే, కడుపులో మంట వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి ఆహారంలో, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిమంచిదని చెప్తారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిన తర్వాత, దానికి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి మంచిదని చెప్తారు.

సరే ఆ సంగతి వదిలేసి, పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సులభంగా తయారు చేయవచ్చు.
కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వాటికి సరిపడా చింతపండు, ఉప్పు, ఇంగువ.
నీటిలో కడిగి శుభ్రం చేసి, తేమ లేకుండా తుడిచిన పచ్చిమిర్చిని, ఉప్పును రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి దంచి, కొంచెం దంచిన తర్వాత, దానికి చింతపండు కలిపి దంచుకోవాలి. కావలసిన వారు జీలకర్ర వేసుకోవచ్చు.
ఆఖరున ఇంగువ కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.
ఇది అన్నం లోకి, రొట్టెలు, టిఫిన్స్ అన్నింటిలోకీ బాగుంటుంది.
ఆ పచ్చడికి కొత్తిమీర కలిపి చేస్తే , ‘పచ్చిమిర్చి కొత్తిమీర’ పచ్చడి అవుతుంది.
పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ మాత్రమే కలిపి చేస్తే, అది ‘పచ్చిమిర్చి కారం’ అవుతుంది.
ఈ పచ్చడికి ఉల్లిపాయ కలిపి చేస్తే, ఉల్లిపాయ పచ్చడి అవుతుంది. ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు.
ఒకే విధానంతో రకరకాల పచ్ౘ్ళ్లు చేసుకోవచ్చు.
రచన: శ్రీమతి లతా కృష్ణమూర్తి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి






