అధిక దిగుబడిని ఇచ్చే కూరగాయల విత్తనోత్పత్తి

అధిక దిగుబడులు ఇచ్చే కూరగాయల విత్తనాల ఉత్పత్తిని తతెలంగాణా రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్నట్లు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా కూరగాయ పంటల్లో ఈ విత్తనోత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పరిశోధన, విస్తరణ మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దెందుకు ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. సాంకేతికత, ఆధునికత, యాంత్రీకరణ ద్వారా కూరగాయల సాగుకు ఊతమిస్తున్నాం. జీవ ఎరువులు, పురుగు మందుల లభ్యత పెంచుతాం. పంట నష్టాలను నివారించేందుకు వాతావరణ ఆధారిత ఉద్యాన సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తాం” అని రాజిరెడ్డి తెలిపారు.

Read More

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో ఆయిల్‌పామ్‌లో మంచి ఫలితాలు

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగులో ఆధునిక సాంకేతికతను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇక్రిశాట్‌లో 100 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్‌లో నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి రకాల వృద్ధి, హైబ్రిడ్ సృష్టికి ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం భారత్ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ని సైతం భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఏటా రెండు లక్షల ఎకరాల పెంపుదలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ రంగంలో ఆయిల్‌ఫెడ్, ప్రైవేటు రంగంలో 14 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలను ఇస్తోంది. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయిల్షామ్ సాగుకు ఏర్పడుతున్న అడ్డంకులను ప్రభుత్వం అధ్యయనం చేయించి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Read More