కోతులు… బాబోయ్… కోతులు

మామిడి చెట్టుకు కాయల్ని వుండనీయవు, కూరగాయల్ని దక్కనీయవు. మొక్కజొన్న కంకుల్ని మిగలనీయవు. నాటిన వరి నారు మొక్కల్ని పీకి వేస్తున్నాయి. ఎండబెట్టిన వడియాలు, అప్పడాలకు రక్షణ లేదు. గుళ్లో భగవంతుని స్మరించుకోనివ్వవు. మందలుగా ఇళ్ళలోకి చొరబడి ఖంగాళీ చేస్తున్నాయి. వెంటబడి రక్కుతాయి. ఉరికించి ఉరికించి ప్రాణాలు తీస్తున్నాయి. రేబీసు లాంటి రోగాల్ని అంటించి చంపుతున్నాయి. అడవుల్లో, తోటల్లో నాటిన మొక్కల్ని బ్రతకనీయవు. ఉయ్యాలలో ఉన్న పసిపాపల్ని ఎత్తుకు పోయి చెట్ల మీద కూర్చున్న  కోతుల సంఘటల్ని కూడా మనం చూశాము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిల్లా ప్రభుత్వ కార్యాలయం పైన వాటర్ ట్యాంక్‌లో 23 కోతులు ప్రవేశించి బైటకు రాలేక నీళ్ళలో మునిగి చనిపోయిన విషయం తెలియక అదే నీటిని కొన్ని రోజుల పాటు త్రాగిన ఉద్యోగులు చెందిన భయాందోళనల సంగతి మనలో చాలామందికి గుర్తు వుండే ఉంటుంది. ఇలా కోతుల వల్ల మన రైతులు, పంటలు, ఆస్తులు, ప్రాణాలకు జరుగుచున్న ముప్పు సమస్య నానాటికీ తీవ్రమౌతూ వుంది. అడవుల్లో వాటి సహజ ఆవాసాలు, ఆహారాల లభ్యత క్షీణించుట వల్ల మరియు అదుపులేని సంతానోత్పత్తి వల్ల మనుగడ కోసం అవి పంట పొలాలు, జనావాసాలలోకి చొరబడి అనేక విధాలుగా మనకు ఇబ్బందుల్ని, నష్టాలను కలిగిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, మానవతా దృష్టి, జంతు హింసా నివారణా చట్టాల వల్ల, వాటిపై ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితి మన భారతీయులది!

కోతుల వల్ల నానాటికీ మన ఆస్తులకు, ప్రాణాలకు జరుగుచున్న నష్టాల నివారణకు మనతోపాటు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. అయినా ఈ క్రింద పేర్కొన్న మార్గాలతో కొంతవరకు ఈ సమస్యలకు దూరం కావచ్చు. వీటి గురించి చర్చిద్దాము.

మనదేశీ కోతుల జీవన కాలం 16 నుండి 20 సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు యుక్తవయస్సుకు వచ్ౘ్ే కోతుల చూడి కాలం 165 నుండి 175 రోజులు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులు.

కోతులు కారం, వెల్లుల్లి, వెనిగార్, మిరియాల వంటి ఘాటైన వాసనల్ని భరించలేక దూరంగా తరలి పోతాయి. నిమ్మ చెట్ల ముళ్ళు, నిమ్మకాయల వాసనలకు దూరంగా వైదొలగుతాయి. గర్ౙనలు, ప్రేలుళ్లు, టపాకాయల శబ్దాలకు బెదిరి పారిపోతాయి. చింపాజీలు, కొండముచ్చులు, ఇతర వన్య మృగాలంటే కోతులు భయపడ్తాయి.

కేంద్ర ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెంబరు 1091 కి ఫోను చేసి కోతుల నుండి ఎదుర్కొంటున్న ముప్పుపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం వారి నుండి సహాయం, రక్షణ పొందే అవకాశం ఉంది.

పంటలు, తోటల చుట్టూ స్వల్ప స్థాయిలో షాకునిచ్చే విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేసుకోవచ్చును.. ఖరీదైన పంటలు, పూల మొక్కలు, నర్సరీలను పటిష్టమైన గ్రీన్‌హౌస్‌లలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.

చెట్ల మొదళ్లు, గోడల మీద, ప్రవేశ ద్వారాలు, గుమ్మాలు, ఆస్తుల అంచుల మీద కారం, వెల్లుల్లి వంటి పొడులు లేదా స్ప్రేలను చల్లాలి. గోడల మీద ముళ్ల తీగల్ని, గాజు పెంకుల్ని అతికించుకోవాలి.

ఒక కోతిని పట్టుకుని, వాటి శరీరమంతా ఎర్రటి రంగును పూస్తే ఇదేదో కొత్త జంతువని భయంతో మిగిలిన కోతులు దూరంగా పారిపోయే అవకాశం ఉంది. కొండముచ్చును  పెంచినా, అది కోతుల్ని దూరంగా తరిమివేయగలదు. అయితే కొండముచ్చుల వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే ముప్పు ఉండవచ్చు. 

ప్రత్యక్షంగా టపాకాయల్ని పేల్ౘ్డం లేదా టపాకాయల శబ్దాలు, భయంకరమైన శబ్ధాలను ఇచ్చే టేప్‌రికార్డుల్ని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది.

కాపలాదారులు ఎలుగుబంటి లేదా పులి వేషాలతో తోటలలో సంచరిస్తూ కూడా కోతుల్ని బెదిరిస్తూ దూరంగా తరిమివేయవచ్చు. 

మామిడి, మునగ, జామ, కొబ్బరి వంటి చెట్ల ప్రధాన కాండాల మొదళ్ళ చుట్టూ గొడుగు ఆకారం రేకును ఇనుప సూదుల వైర్లను అమర్ౘ్ి కోతులు చెట్ల మీదకు ఎక్కకుండా చూడవచ్చు. 

కోతుల సంతాన నియంత్రణః
కోతుల్ని సంహరించలేము. కనీసం హింసించడం కూడా చేయలేము. అయితే వేగంగా పెరిగిపోతున్న వాటి సంతతిని నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కోతుల జనన నియంత్రణ అమలు చేయటం అంత సులువుకాదు. “కోతిపుండు బ్రహ్మరాక్షసి” అనే నానుడి వుండనే వుంది. శస్త్రచికిత్స గాయం ఎంత చిన్నదైనా దానిని కెలికి బ్రహ్మపుండుగా చేసుకొని భయానకం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఇది కూడా తీవ్రమైన హింసతో కూడుకొన్నది.

అయితే రెండేళ్ల వయస్సు దాటిన ఆడకోతుల్ని పట్టుకుని అతి స్వల్ప గాయంతో దీర్ఘకాలం పనిచేసే హార్మోను సాధనాన్ని (ఇన్‌ప్లాంటు) చర్మం క్రింద అమర్చితే 5-6 సంవత్సరాల వరకు అవి గర్భం దాల్ౘ్కుండా చేసే అవకాశం ఉంది. మహిళల్లో గర్భ నియంత్రణకు అమలు చేసే ఈ విధానాన్ని ఆడ కోతులలో అమలు చేయడానికి మన పశువైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం వుంది. ఇందుకు వినియోగించే ఒక్కొక్క హార్మోను సాధనం (ఇన్‌ప్లాంటు) ఖరీదు 500Ð600 రూపాయలు ఉండవచ్చు.  ఈ విషయమై మన పశువైద్య పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజారోగ్య శాఖవారు, అటవీశాఖవారు, జంతు ప్రేమికులు, స్థానిక సంస్థలు సమన్వయంతో కార్యాచరణను చేపట్టాలి. ఈ పథకంలో అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అడవులలోపల పండ్లను ఇచ్చే మామిడి, మారేడు, నేరేడు, వెలగ, మర్రి రావి వంటి మొక్కల్ని పెంచి కోతులకు త్రాగునీటి వనరుల్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచగల్గితే కోతులు జనావాసాలకు, పంటల మీదకు వచ్చే అవకాశాలు వుండవు. కోతులలో పునరుత్పాదక శక్తిని తగ్గించే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కలిగిన మొక్కల్ని ఆయుర్వేద నిపుణుల సూచనలతో పెంచే ఆలోచన చేయుట కూడా మంచిదే!

అయినా ఈ సూచనపై శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ సహకారాలు కూడా చాలా అవసరం.

పంట భూముల్ని, ఉద్యాన వన పైర్లు, పెరటి తోటల్ని ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న కోతుల బెడదపై మన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.

డా. యం.వి.జి. అహోబలరావు, ఫోన్: 9393055611

Read More

తేనెటీగలు కుట్టకుండా కాపాడుకోవడం ఎలా?

వివిధ జాగ్రత్తలు తీసుకొనినప్పటికిని తేనెటీగలను పెంచుకునేవారు, తేనెటీగల కాట్లకు (stings) అలవాటు పడిపోతారు. అయినప్పటికిని, పరిశ్రమలోవున్న వారందరును, వీటినుండి తప్పించుకొనుట ఎలా అను విషయమును తెలుసుకొనవలెను. కొన్ని సామాన్య నియమములు వున్నవి. వీటిని పాటించి కనీసము, కుట్టు సమయములను తగ్గించుకొనవచ్చును.

• తేలిక రంగు, మృదువుగా గల వస్త్రములను ధరించుకొనవలెను. ఇలాంటి వస్త్రములు ధరించుకున్నపుడు కుట్టే అన్నికీటికములు కూడా తక్కువగా కుడతాయి.

• తలకు రాసుకునే హెయిర్ ఆయిల్, గడ్డము గీచుకున్న తరువాత వాడు లోషన్లు (after shaves) పరిమళాలు (perfumes) మరియు ఇతర ఇంపైన సువాసనలు (sweet smellings) వెదజల్లు పదార్ధములను వాడరాదు. ఇవి కుట్టే కీటకములను ఆకర్షిస్తాయి. తీయటి వాసనలుగల, సువాసనలు వెదజల్లు పుష్పములమీద ఆహారము సేకరించుకునే కీటకములు, పరిమళములు పూసుకున్న వ్యక్తి వద్దకు పొరపాటున ఆహారమూలమని (food) ఆకర్షించబడతాయి.

• ప్రతిదినము స్నానము చేయవలెను. శుభ్రమైన వస్త్రములను ధరించవలెను. కుట్టేకీటకములకు చెమట, చికాకును కల్గిస్తుంది. తేనెటీగల పెంపకదారులు గమనించినదేమనగా తేనెటీగలు చాల తరచుగా, చెమటతో నిండిన చేతిగడియారము ప్రాంతములో కుట్టడము.

• శరీరమును సాధ్యమైనంత పూర్తిగా కప్పుకొనవలెను. పొలములో నడిచేటపుడు మోకాళ్ళ వరకు వుండే బూట్లు ధరించడము మంచిది. లేక తెలుపు కాటన్ సాక్సులు ధరించవలెను. తలను, వెంట్రుకలను గడ్డిటోపీతో (straw hat) లేక తేలికరంగులో వున్న చేతి రుమాలుతో కప్పుకొనవలెను. ఇలా చేసినట్లయితే కుట్టే తేనెటీగలు తలవెంట్రుకలలో చిక్కుకొనకుండా ఆపుచేయవచ్చును.

• వెచ్చని దినములలో కొత్త స్థలములో కూర్చొని, భూమిమీద మరియు చెట్లపైన కందిరీగల గూళ్ళు వున్నవేమోనని, ఎగురుచున్న కందిరీగలను గమనించవలెను. వసంత కాలములో సాంఘిక జీవనము చేయు కందిరీగలు వాటి గూళ్ళను కట్టుకుంటాయి. వర్షానంతరము కల్లా ఒకేఒక అడకీటకము ప్రారంభించిన గూటిలో అనేక వేల కందిరీగలు వుండవచ్చును. సంఖ్య పెరిగేకొలది ఎగిరే కీటకముల సంఖ్య కూడా పెరుగుతుంది. ఒక్కసారి వెచ్చని వాతావరణము వచ్చిన తోడనే పెద్దసంఖ్యలో కందిరీగలను కనిపెట్టవచ్చును. మరియు నాశనము చేయవచ్చును.

• వదిలివేయబడిన ఆహారమును, చెత్తను తొలగించవలెను. లేనిచో కందిరీగలు వాటిని ఆహారముగా తీసుకుంటాయి. అనేక సాంఘిక జీవనము చేయు కందిరీగలు పట్టణాలలో నివసిస్తాయి. వయోజన కందిరీగలు, సోడా, పాలు, జామ్ మొదలగువాటిని ఆహారముగా తీసుకుంటాయి. ఇవి రొట్టెను, ఇతర వదిలివేయబడిన ఆహారములను వాటి లద్దెపురుగుల కొరకు సేకరించుకుంటాయి.

• ఒక వ్యక్తి అనేక కుట్టే కీటకములచే ఒకేసారి దాడిచేయబడినప్పుడు పరుగెత్తవలెను. ఒక పట్టును కలవరపరచినపుడు లేక విరుగగొట్టిన సమయములో మాత్రమే ఇలాంటి దాడి మనుషుల మీద వుంటుంది. తలుపులు మూసివున్నగదిలోనికి గాని లేక ఇతర ఏస్థలము కనబడని పక్షములో నీటిలోనికి దుమకవలెను. అవకాశముంటే బహిరంగస్థలముకంటే గూడ నీడగల ప్రదేశములోనికి పరుగెత్తుట ఉత్తమము. కోపముతో నిండిన కుట్టే కీటకములకు పొదలలోగాని అరణ్యములోనికిగాని వెంటబడి తరుముట కష్టము.

• ఒకే ఒక కుట్టే కీటకము వెంబడిస్తూ వున్నట్లయితే మఖమును క్రిందకు పెట్టుకొని నేలమీద పడుకొనవలెను. కందిరీగలు మరియు తేనెటీగలు కళ్ళు, ముక్కు మరియు చెవుల చుట్టూ కుట్టడానికి ఎక్కువ అవకాశములుంటాయి. ఎందుకనగా వీటిని కదులుతూ లేక కదులుతూవున్న ఛాయచిత్ర రూపములుగా తేనెటీగలు కనుగొంటాయి.

• కారు అద్దం గుండా కుట్టే ఈగ ప్రవేశించినట్లయితే కారును ఆపుచేయవలెను. కందిరీగగాని లేదా తేనెటీగ గాని, కదిలే కారులోనికి ప్రవేశిస్తే, అది కుట్టడం కన్నా, కారు నుండి తప్పించుకొనడానికే ప్రయత్నిస్తుంది. అలాంటపుడు కారును నెమ్మదిగా ఆపి, రోడ్డు మార్జిన్లో దించి, సాధ్యమైనంతవరకు కదలకుండా వుండవలెను. కారును ఆపిన తరువాత అన్ని అద్దాలను తెరవవలెను. ఆ కీటకము త్వరగా తప్పించుకొనుటకు మార్గమును కనుగొంటుంది.

First aid for bee stings – తేనెటీగల కాటుకు ప్రాధమిక చికిత్స
ఒక కూలిఈగ కుట్టినపుడు, దాని యొక్క ఉదరపు (tip of the abdomen) కొన తన మిగతా శరీరభాగములకు సమాంతరముగా ఉండి తన శత్రువును కుట్టినపుడు ముల్లు (sting) యొక్క పొడవులో కనీసము సగభాగము, శత్రువు శరీరములోనికి దించి తిరిగి వెనుకకు లాగుకుంటుంది. భౌతికముగా ముల్లు శరీరంలోకి దిగినందు వలన మరియు తేనెటీగలో ఉన్న విషం వలన నొప్పి వెను వెంటనే కలుగుతుంది.

ప్రాధమిక చికిత్సలో భాగముగా శరీరము నుండి ముల్లును వెంటనే తీసి వేయవలెను. ఎక్కువ మంది తేనెటీగల పెంపకము దారులు ముల్లును శరీరము నుండి వదిలించు కొనుటకుగాను, హైవ్ టూల్ లేదా గోటితో తీసివేస్తుంటారు. కొంత సమయం తీసుకొని కత్తికొరకు వెదకి ముల్లును తీసివేయుట కొరకు సమయాన్ని వృధా చేయడం అనవసరము. తేనెటీగలను పట్టుకొని బలవంతముగా ముల్లును బయటకు లాగి గోరుమీద ఉంచినట్లయితే విషమంతా వెంటనే వేగముగా దాదాపు బయటకు రావడము కన్పిస్తుంది. తేనెటీగ విషము అనేక సంక్లిష్ట పదార్దములు అనగా నొప్పిని, వాపును మరియు దురదను, అనేక దినముల వరకు కలుగజేయు విధముగా రూపొందించబడింది. ఒక్కసారి విషము శరీరములోనికి ప్రవేశించినపుడు దానిని తొలగించు మార్గము లేదు, విషప్రభావమును తొలగించు పదార్ధములు గాని విరుగుడు గాని లేదు. ప్రాధమిక చికిత్సలో భాగముగా, శరీరంలో కలిగే నొప్పిని ఉపశమనం పొందుటకును గాయమునకు సూక్ష్మజీవులు సంక్రమించకుండా (Infection) గురికాకుండా చేసికొనవలెను.

తేనెటీగ కుట్టినపుడు మంచుగడ్డ (ice)ను ఆ భాగము మీద ఉంచినట్లయితే బాగా ఉపశమనము పొందవచ్చును, ఇతర ఏ రకమైన చికిత్సల కంటే కూడ, ఆల్కహాల్ ను రుద్దడము ద్వారా ఆల్కహాలు ఆవిరయ్యి చల్లదనమును శరీరము మీద కలుగజేస్తుంది. దీనిని కూడా ప్రాధమిక చికిత్సలో భాగంగా చెప్పుకొనవచ్చును. వ్యాపార పరంగా తేనెటీగలను పెంచుకొనువారికి దాదాపుగా ప్రతిరోజు తేనెటీగలు కుడుతూనే ఉంటాయి. వారు తేనెటీగల విషానికి తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటారు.

డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643

జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.

Read More

వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుతో అనేక ప్రమాదాలు

ధూమపానం చేసే వారి నిర్లక్ష్యంతో, విద్యుదాఘాతంతో ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం పంట వ్యర్థాల దహనం పేరిట, పెట్టే మంటలకు సమీప రైతుల ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంటలను తగలబెట్టడం మంచిది కాదని హితబోధ చేస్తున్నా, పెడచెవిన పెడుతున్న వ్యక్తులతో నిత్యం ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉన్నాయి. పచ్చని చేలు సైతం బూడిదగా మారుతున్నాయి. ఈ ఏడాది మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా కోతలు ముమ్మరంగా సాగగా, ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. కోతల అనంతరం ఖరీఫ్‌కు చేలను సిద్ధం చేయాలన్న ఆలోచనలో రైతులు, కంకులు విరవగా, ఉన్న పంట వ్యర్థాలను తగలబెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఒకరిని చూసి, మరొకరు ఇదే పనికి పూనుకుంటున్నారు. ఏ చేను చూసిన మసిగా మారి కన్పిస్తోంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెళ్తున్న అగ్నిమాపక శకటాలకు సరైన దారిలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుండటంతో సకాలంలో ఆర్పలేకపోతున్నారు.
20కి పైగా ప్రమాదాలు: మైలవరం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఆరు మండలాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 20 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ పొలాల్లో నిప్పు పెట్టినవే. విలువైన జామాయిల్ పంటలతో పాటు సాగునీటి సరఫరా సామగ్రి దగ్ధమ య్యాయి. ఎండలు మండుతున్న తరుణంలో, పూర్తిగా ఎండిన చేలల్లో అగ్గిపుల్ల గీసేసి వెళ్తుండటంతోనే పక్క చేలకు వ్యాపించి, ప్రమాద స్థాయి పెరుగుతోంది. కొన్నిసార్లు మంటలార్పేందుకు మేము దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అని మైలవరం అగ్నిమాపక అధికారి అన్నారు.

Read More