పంట ఉత్పత్తుల నాణ్యతను పెంచే కొమ్ము సిలికా (501)

దీనిని భూమిలో నుండి తీసిన స్వచ్ఛమైన ఒక దినుసు శిల పటకాన్ని ఆవు కొమ్ములో నింపి సారవంతమైన నేలలో ఆకులు రాలు కాలం లేదా వసంత ఋతువులో పాతి పెట్టి తయారు చేస్తారు. ఒక గ్రాము కొమ్ము సిలికాను సరిపడా నీటిలో కలిపి ఒక గంట సేపు సవ్యదిశలో కలియత్రిప్పి పొలంలోని అన్నిపంటలు, పశుగ్రాసాలపై ఉదయం వేళ పిచికారి చేయాలి. కొమ్ము సిలికా భూమిలో సిలికాతో కలిపి పనిచేసి సూర్యకాంతి శక్తిని నేలకందిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు, భూమిలోనుండి ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు మొక్కల కందడానికి కూడా సహాయపడుతుంది. ఇది పంట ఉత్పత్తుల నాణ్యతను (పక్వదశ, తీపిదనం, రుచి, వాసన, నిల్వశక్తి, పీచు పరిమాణం) పెంచుతుంది. పశుగ్రాసాల రుచిని, హెర్బల్ మొక్కలలో నూనెలను, గింజలలో ప్రొటీన్ పరిమాణాన్ని పెంచుతుంది. కొమ్ము ఎరువు భూమిపై పిచికారి చేసిన తర్వాత కొమ్ము సిలికాని సంవత్సరానికి కనీసం రెండు సార్లు, వసంత ఋతువులో ఒకసారి, ఆకులు రాల్చే కాలంలో ఒకసారి పంటలపై పిచికారి చేయాలి. ఇది అసలైన బయోడైనమిక్ పంటపై చల్లే పిచికారి ద్రావణం.

Read More

అసాధారణ వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి వాతావరణం (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
  1. వర్షాకాలం ఆలస్యమైనప్పుడు
    వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
  2. మధ్యలో పొడి వాతావరణం ఏర్పడినప్పుడు
    వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు.
  3. అధిక వర్షాలు కురిసినప్పుడు
    భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
  4. వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు
    వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
  5. దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం) ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు వంటివి) సాగు చేయడం మేలు.

ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు
• వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు
• వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు
• పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు
• మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ

రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు
• వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి.
• స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి.
• ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
• వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి.
• పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి.
• సమగ్ర పంట నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.

నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.

• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది.
• వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది.
• పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది.
• మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది.
• అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది.
• సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది.
• వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి.
• సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రస్తుత వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము,
వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి. ఫోన్ : 7674886216

Read More

గొయ్యి పద్ధతిలో బయోచార్ తయారీ

యంత్రం లేదా ఇనుప డ్రమ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న గొయ్యి ద్వారా కూడా బయోచార్‌ను తయారు చేయవచ్చు. ఇందుకోసం సుమారు ఒక మీటరు లోతు గల గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిలో పొడి పంట అవశేషాలను నింపి, పైభాగం నుంచి మంట వేయాలి. అవశేషాలు నల్లని రంగులోకి మారడం ప్రారంభమైన తరువాత గొయ్యిని మట్టి లేదా ఇనుప రేకుతో కప్పి, గాలి ప్రవేశాన్ని పరిమితం చేయాలి. ఈ దశలో ఆక్సిజన్ ప్రవేశం నియంత్రించబడటం వల్ల అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

కొంత సమయం తరువాత గొయ్యిని పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మట్టి లేదా ఇనుప రేకును తొలగించి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను నిల్వ చేసుకోవచ్చు లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఈ పద్ధతిలో ఆక్సిజన్ ప్రవేశాన్ని పరిమితం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. గాలి ఎక్కువసేపు లోపలికి ప్రవేశిస్తే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

Read More

‘లాబ్’ (లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా)తో లాభాలు

మొక్కలకు కావలసిన పోషకాలను సహజంగా అందించడానికి లాక్టిక్ ఆసిడ్ బాసిల్లస్‌ను (లాబ్) ఉపయోగించాలి.
లాక్టిక్ ఆసిడ్ ద్రావణం తయారీ

ఇందులో ఉపయోగించుచున్న పదార్థాలలో సహజంగా ఉండే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన శిలీంధ్రాలు మరియు వైరస్ తెగుళ్ళ నియంత్రణలో ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు :
బియ్యపు కడుగు : 5 లీటర్లు
ఆవు పాలు : 10 లీటర్లు
బెల్లం : 1 కిలో

తయారు చేసే పద్ధతి :

  • 5 లీటర్ల బియ్యపు కడుగును ఒక కుండలో పోసి, మూతపెట్టి 7 రోజులు నీడలో ఉంచాలి.
  • 7 రోజుల తరువాత పై ద్రావణానికి 10 లీటర్ల ఆవుపాలను కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మూతపెట్టి మరలా 7 రోజులు నీడలో ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి దానికి బెల్లపు పొడిని కలపాలి.
  • మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి లీటర్ నీటికి 1 లేదా 2 మి.లీ. ద్రావణాన్ని కలిపి మె°క్కలపై స్ప్రే చేయాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను, పండ్ల తోటలలోను వాడవచ్చు.
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
Read More

రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More

మొక్క ఎదగుదల, పంట దిగుబడికి ఇ కో ఎంజైమ్

ఇకో ఎంజైమ్ తయారీ విధానం: 10 లీటర్ల నీరు, పండ్లు, కూరగాయలు, పూలు వీటిలో ఏవైన 3 కిలోలు, బెల్లం 1 కిలో. వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ లేదా తొట్టిలో 10:3:1 నిష్పత్తిలో తీసుకొని బెల్లం కరిగే వరకు కలియ తిప్పి దానిపై మూత ఉంచి 3 నెలల పాటు ఊరబెట్టాలి. మూడు నెలల తరువాత ఊరిన ద్రావణాన్ని శుభ్రంగా వడబోస్తే కావలసిన ఇ కో ఎంజైమ్ తయారైనట్లే. దీనిని ప్లాస్టిక్ సీసాలలో నిలవబెట్టుకోవచ్చు. తయారైన 1 లీటరు ఇ కో ఎంజైమ్‌ని 50 లీటర్ల నీటితో కలిపి పంటలపై పిచికారి చేసుకుంటే తక్కువ ఖర్చుతో మొక్క ఎదుగుదల, పంట దిగుబడి బాగుంటుంది.

Read More

పురుగుల నివారణకు సహవాస పంటగా… వెల్లుల్లి

వెల్లుల్లితో మానవుల అనుబంధం 7000 సంవత్సరాలు. ఇది ఒక ఔషధ గడ్డ మొక్క. సులభంగా సాగు చేయవచ్చు. వెల్లుల్లిని పాయల ద్వారా ప్రవర్థనం చేస్తారు. సేంద్రియ పదార్థమెక్కువగా ఉన్న భూముల్లో వెల్లుల్లి బాగా పెరుగుతుంది. ఇది 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. 0.75 నుండి 1.0 అడుగు వరకు విస్తరిస్తుంది. ఏప్రిల్-మేలో పుష్పిస్తుంది. పూత ఎరుపు తెలుపు రంగులో ఉంటుంది. పూలు అందంగా ఉంటాయి. సీతాకోక చిలుకల నాకర్షిస్తాయి. వెల్లుల్లి వార్షిక, హెర్బల్ మొక్క. ఆకులు సువాసన కలిగి ఉంటాయి. ఆకులు ఆకుపచ్ౘ్ రంగులో సన్నగా గడ్డిలాగా ఉంటాయి..

సాధారణ నామం : గార్లిక్ శాస్త్రీయ నామం : అల్లియం సెటైవం కుటుంబం: అమరిల్లిడేసి

ఉపయోగాలు : ఆరోగ్యరంగంలో … ఆయుర్వేద రంగంలో

  • వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల చికిత్సలో దీనిని 5000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల తర్వాత వెల్లుల్లి తన ప్రాశస్త్యాన్ని తిరిగి సంతరించుకుంది.
  • ట్యూమర్, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. ఉదర, కోలన్, ఊపిరితిత్తులు, రెక్టం క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన సహజ ఆంటిబయాటిక్, యాంటిసెప్టిక్, యాంటివైరల్, యాంటిఇన్‌ఫెక్షన్, జీర్ణాశయ, ఉదర పారసైట్లపై పోరాడుతుంది.
  • శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు, బ్రోంకైటిస్ నుండి కాపాడుతుంది. పసుపుతో కలిసి వాతావరణ కాలుష్యం, పొగాకు పొగ నుండి, జలుబు, జ్వరం నుండి రక్షిస్తుంది. కొలెస్టరాల్‌ని అధికంగా తగ్గిస్తుంది. నోటి పుళ్ళు, గొంతునొప్పి, అలసట, ప్లేగ్, కలరా, రాబీస్ నుండి కాపాడుతుంది.
  • హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.
  • తగ్గిన శక్తి, ధైర్యాన్ని తిరిగి తెస్తుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. శరీరావయవాలను చలి నుండి కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో
పురుగుల నివారణ :

  • వెల్లుల్లి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే ట్రెబోలియం కాస్టేనియంని అతితక్కువ గాఢతలో వికర్షించింది. పెద్ద పురుగులు, లార్వాలపై ఫ్యూమిగెంట్, కాంటాక్టు చర్యలను ప్రదర్శించి, పెద్ద పురుగులలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించింది. అభివృద్ధి ప్రక్రియలలో జోక్యం చేసుకుని లార్వాలు ప్యూపాలుగా, ప్యూపాలు పెద్ద పురుగులుగా మారడాన్ని నిరోధించింది. యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. (ముఖేష్‌కుమార్ బేబే, 2013)
  • వెల్లుల్లి నీరు మరియు మిథనాల్ ద్రావణాలు (1000 పిపియం) పొగాకులద్దె పురుగు లార్వాలను 81% మరియు 64% చంపాయి (మెరిగ, అతని అనుచరులు, 2012)
  • వెల్లుల్లిని అనేక సంవత్సరాలుగా ప్రధాన పంటగా పురుగుల నివారణకు సహవాస పంటగా సాగు చేస్తున్నారు.
  • క్యాబేజి వరుసల మధ్య వెల్లుల్లి లేదా ఉల్లి అంతర పంటగా నాటితే పురుగులను వికర్షిస్తాయి. కనుక చిన్న కమతాల రైతులు వెల్లుల్లి లేదా ఉల్లిని క్యాబేజి పంటలో అంతర పంటగా వేసి పురుగుల తాకిడిని తగ్గించవచ్చు. (దేబ్రా, మిషెక్, 2014)
  • వెల్లుల్లి పొడి, వెల్లుల్లి ద్రావణం, వెల్లుల్లి నూనె పిచికారి పురుగులను నివారిస్తుంది. గార్లిక్ నూనె యాంటి బాక్టీరియల్, యాంటిఫంగల్, కీటకనాశన లక్షణాలు కలిగి ఉంది. గార్లిక్ నూనెని మినరల్ ఆయిల్, సబ్బు ద్రావణంతో కలిపితే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది (లేరాగోమెజ్, సైంటిస్ట్, సియంపిఆర్, కేరళ)

వెల్లుల్లి గడ్డ ద్రావణం :
కావలసిన పదార్థాలు : తరిగిన వెల్లుల్లి 85 గ్రా., మినరల్ ఆయిల్ (కిరోసిన్ లేదా వెజిటబుల్ ఆయిల్) 50 మి.లీ., సబ్బు ద్రావణం 10 మి.లీ., నీరు 950 మి.లీ., ప్లాస్టిక్ బాటిల్ 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని వెజిటబుల్ ఆయిల్‌కి కలపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత దీనికి నీరు, సబ్బు ద్రావణం కలిపి కలియత్రిప్పి బాటిల్‌లో నిల్వ ఉంచాలి.

ఉపయోగించే విధానం : ఒక భాగం ఎమల్షన్‌ని 19 భాగాల నీటికి కలపాలి (50 మి.లీ. ఎమల్షన్‌ని 950 మి.లీ. నీరు కలపాలి. పిచికారి చేసే ముందు బాగా కదిపి ఉదయం వేళ పంటపై పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : ప్రత్తి బోల్‌వర్మ్, ఆర్మీవర్మ్, కాటన్ స్టెయినర్, ఉల్లి, తామర పురుగులు, పొటాటో మాత్, రూట్ నాట్ నెమటోడ్, చెరకు కాండం తొలుచు పురుగు, బాక్టీరియా తెగుళ్ళు, ఆంత్రాక్నోస్, బూజు తెగులు, వరి అగ్గితెగులు, కాయకుళ్ళు తెగుళ్ళు, బూడిద తెగులు, త్రుప్పు తెగుళ్ళు.

వెల్లుల్లి నూనె :
కావలసిన పదార్థాలు : వెల్లుల్లి 100 గ్రా., మినరల్ ఆయిల్ 2 చెంచాలు, నీరు 10.5 లీటర్లు, సబ్బు ద్రావణం 10 మి.లీ., మూత ఉన్న పాత్ర 1

తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కలను మినరల్ ఆయిల్‌లో ఒక రోజు నానబెట్టాలి. అరలీటరు నీరు, సబ్బుద్రావణం కలిపి బాగా కలియ త్రిప్పాలి.
ఉపయోగించే విధానం : వడపోసిన ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలపాలి. స్ప్రేయర్లో నింపి నూనె నీటిపై తేలకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మొక్క పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు : క్యాబేజి వర్మ్, పచ్చదీపపు పురుగులు, స్క్వాష్ బగ్స్, తెల్లదోమలు (ప్రకాష్, రావు ;1997)

గార్లిక్ ఆయిల్ ఎమల్షన్ :
కావలసిన పదార్థాలు : గార్లిక్ ఆయిల్ 50 మి.లీ., నీరు 950 మి.లీ., సబ్బు ద్రావణం 1 మి.లీ.

తయారు చేసే విధానం : సబ్బు ద్రావణాన్ని నూనెకి కలిపి బాగా కలపాలి. నీరు కలిపి బాగా కలియ త్రిప్పాలి.

ఉపయోగించే విధానం : నూనె నీటిపై తేలకుండా తయారు చేసిన వెంటనే పిచికారి చేయాలి. ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.

టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : బోల్‌వర్మ్, పొటాటోట్యూబర్‌మాత్, వరి అగ్గి తెగులు, వరి గోధుమ మచ్చ తెగులు, రూట్‌నాట్ నెమటోడ్ (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1999)

వెల్లుల్లి ద్రావణం నివారించే పురుగులు, తెగుళ్ళు

  • వేరుశనగలో నులి పురుగులు, స్ట్రాబెర్రీ వెస్ట్రన్ ఫ్లవర్ తామర పురుగులు
  • వెల్లుల్లి ద్రావణం ఆల్టర్నేరియా, బోట్రైటిస్, మాగ్నపోర్థె, ఫ్యుజేరియం శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది.
  • వరిలో అగ్గితెగులు, ఫైటోఫ్తోరా ఇన్‌ఫెస్టాన్స్ (పొటాటోలేట్ బ్లెåట్)
  • దోస పంటలో బూడిద తెగులు, బూజుతెగుళ్ళను నివారించింది.
  • టమాటలో ఆకుతొలుచు పురుగు, కందిలో ఎర్రనల్లి, నులి పురుగులు
  • వెల్లుల్లి, మిరప ఆకు ద్రావణాలు క్యాబేజి పంటనాశించే ప్లుటెల్లా క్ౙెలోస్టెల్లా, బ్రెవికారినెబ్రాసికె, హెలుల్లా అండాలిస్, ట్రైకోప్లూసియాని పురుగులను రసాయన పురుగుమందు “అటాక” కన్నా తక్కువ ఖర్చులో నివారించాయి. గార్లిక్ ద్రావణం అత్యధిక ఖర్చు : లాభం నిష్పత్తి (1:16)ని నమోదు చేసింది. అటాక్ పిచికారి చేసిన ప్లాట్లలో ఖర్చు : లాభం నిష్పత్తి 1:9.2 మాత్రమే. అందువలన వెల్లుల్లి ద్రావణాన్ని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. (బైడు, మోచయ్య, 2016).
  • గోధుమ గింజల నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని వెల్లుల్లి, పసుపు ద్రావణాలు సమర్ధవంతంగా నివారించాయి (సజ్ౙద్ ఆలీ, అతని అనుచరులు, 2014)
  • వెల్లుల్లి పొడి, ద్రావణం, నూనె నిల్వ ఉంచిన అలసంద గింజలను కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ కల్గించే నష్టం నుండి కాపాడాయి (డెన్లోమె, 2010)
  • గార్లిక్ ద్రావణం {+1% సబ్బు ద్రావణం పీచ్ పొటాటో పేనుబంక, మైజస్ పెర్సికెని నివారించింది (డాన్స్‌విక్ౙ్, అతని అనుచరులు, 2011)
  • వెల్లుల్లి, వేప, పొగాకు, కలబంద ద్రావణాలు పురుగుల నివారణకుపయోగిస్తాయి. వీ\న్నింటిలో వెల్లుల్లి ద్రావణం అతి సమర్ధవంతంగా పనిచేస్తుంది (మెలెస్, అతని అనుచరులు, 2012)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

కోడిగుడ్లతో అమినో ఆమ్లం

ఎన్. గోపాల్‌క్రిష్ణన్ అనే అభ్యుదయ రైతు గుడ్లు, నిమ్మకాయలతో మొక్కల పెరుగుదలకు హార్మోన్ తయారు చేశారు. తమిళనాడులో అనేక మంది దీనిని ఉపయోగించి లాభాలు పొందుతున్నారు. ఆయన దీని తయారీ విధానం గురించి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

కావల్సిన వస్తువులు – తయారీ విధానం

  • 20-25 నిమ్మకాయలు
  • 250 గ్రాముల బెల్లం
  • 10-15 కోడి లేక బాతు గుడ్లు ఒక బకెట్‌లో నిమ్మకాయల రసాన్ని తీయాలి. దీనిలో బెల్లాన్ని కరగబెట్టాలి. ఈ రసంలో గుడ్లు మునిగేటట్లు ఉంచి గాలి చొరబడకుండా బకెట్‌కు మూత పెట్టి నీడలో పది రోజుల పాటు ఉంచాలి. గుడ్లు పెంకుతో సహా రసంలో కరిగి రబ్బరు బంతుల్లా తయారవుతాయి. పది రోజుల తరువాత రబ్బరు బంతుల్లా మారిన గుడ్లను చేతులతో నలిపి దాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో మరోసారి బెల్లం రసాన్ని కలపాలి. ఉదాహరణకు బకెట్‌లో రెండు లీటర్ల రసం ఉందంటే దానికి మరో రెండు లీటర్ల బెల్లం రసాన్ని కలపాలి. తిరిగి బకెట్‌కు గట్టిగా మూత పెట్టి మరో పది రోజులు ఉంచాలి. పది రోజుల తరువాత దీన్ని పంటల మీద ఉపయోగించవచ్చు. 10Ð15 మి.లీ. రసాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పంటల మీద స్ప్రే చేయాలి.

ఏ పంటలకు ఉపయోగపడుతుంది?
ఈ సేంద్రియ హార్మోన్‌ను వరి, గోధుమ, అరటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు. పిచికారి వేళలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం, సాయంత్రం పొద్దు మునిగే ముందు పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి పంచగవ్య, వర్మివాష్‌లను కూడా కలిపి వాడవవచ్చు. ద్రావణం తయారు చేసేటప్పుడు మూతకు చిన్న చిన్న రంధ్రాలు పెడితే మంచిది. దీనిని ఆరు మాసాల వరకు నిలువ చేసుకోవచ్చు.

Read More

మాంసం, వరి పొట్టుతో కునపజలం

ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.

ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.

దిగుబడిని పెంచే కునపజలం
కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు

తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.

Read More

ఔషధ మొక్క… శీకాయ

శీకాయ దాదాపు 10-12 మీ. ఎత్తు వరకు పెరిగే బలమైన ముళ్ళతో కూడిన బహువార్షిక తీగ. కొమ్మలు గోధుమరంగులో వుండి, తెల్లని మచ్చలతో కూడి ఉంటుంది. పుష్పాలు చిన్నగా, కాయలు చిన్న కాడతో పలుచగా, బల్లపరుపుగా ఉండి 6-15 గింజలు కలిగి ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

సాధారణ నామం : సోప్‌నట్ అకేసియా, శీకాకాయ
శాస్త్రీయ నామం : అకేసియా కాన్సిన్నా కుటుంబం: మైమోసేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కాయలు, బెరడు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. బెరడులో సపానిన్, కాయలో అకేసిన్ అనే రసాయనాలుంటాయి. బెరడును ఉబ్బసవ్యాధి నివారణకు, సబ్బులు మరియు షాంపూల తయారీలో ఉపయోగిస్తారు. మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, క్రిమిసంహారిణిగా, రక్తస్రావాన్ని అరికట్టుటకు, కుష్టు, బొల్లి వంటి చర్మవ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలను అతికించడానికి కట్టే కట్టులో, పొడి చేసిన కాయలను సబ్బులకు బదులుగాను ఉపయోగించవచ్చు.

వ్యవసాయరంగంలో …

  • శీకాయ గింజల మిథనాల్ ద్రావణం మరియు గింజల, ఆకుల ఇథైల్ ఎసిటేట్ ద్రావణాలు హైబ్లేయ ప్యూరియాని అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2000).
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలసఒరైజె, మరియు రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం కాస్టానియంపై యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (క్వాద్రి, 1973). అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణాన్ని (2%, 5%) 40 రోజుల వరినారు మొక్కలపై పిచికారి చేస్తే సుడిదోమ, నీల పర్వత లూజెన్స్ గుడ్లు పెట్టడాన్ని తగ్గించింది (రెడ్డి అండ్ అర్స్, 1988)
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం (50 పిపియం) పొగాకు లద్దెపురుగు, స్పోడోప్టెరా లిటూర లార్వాలను (85.2%) సమర్ధవంతంగా నివారించింది. ఇది సోయాబీన్ పంటనాశించే పొగాకు లద్దె పురుగు పర్యావరణహిత యాజమాన్యానికి సుస్థిర పరిష్కార మివ్వగలదు (పాటిల్ అండ్ చావన్, 2010).
  • శీకాయ చెట్టు బెరడు క్లోరోఫాం ద్రావణం సూడోమోనాస్ ఈరోజినోసా, స్టెఫైలో కోకస్ ఆరియస్‌పై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (వర్గీస్ రాజా అండ్ శివరాజ్, 2012) శీకాయ గింజల ద్రావణం రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (ద్విజేంద్ర సింగ్, 2014).
  • శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయ ఇథనాల్ ద్రావణం (సాపోనిన్ కలిగి ఉన్నవి)తో శుద్ధి చేసిన ఫేసియోలస్ అకానిటిఫోలియస్ గింజలపై కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, గింజల నుండి వెలువడే పెద్ద పురుగులను గణనీయంగా తగ్గించింది. శీకాయకాయల ఇథనాల్ ద్రావణం జీవపురుగు మందు లక్షణాలు కలిగి పల్స్‌బీటిల్‌ని సమర్ధవంతంగా నివారించగలదు (బజాద్ అండ్ పరదేశి, 2016).
  • అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ మరియు ఇథైల్ అసిటేట్ ద్రావణాలు మరియు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణం టేకు ఆకులను తినే పురుగు హైబ్లీయప్యూరియా లార్వాలను అత్యంత సమర్ధవంతంగా 100% నివారించాయి (దీప అండ్ రెమాదేవి, 2011).
  • అకేసియా కాన్సిన్నా గింజల పొడి వరి ధాన్యాన్ని నిల్వ సమయంలో ఆశించే పురుగులను యాంటీఫీడెంట్ చర్య ద్వారా నివారించింది., అకేసియా కాన్సిన్నా క్రూడ్ ద్రావణం చెరకు పంటలో ముఖ్యపురుగైన సెరటోవాక్యునా లానిజెరాని ప్రయోగశాలలో మరియు క్షేత్ర ప్రయోగాలలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (పాటిల్ అండ్ చవాన్, 2009).
  • అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ ద్రావణం యానిమల్ స్కిస్టోమియాసిస్ వాహకం ఫ్రెష్‌వాటర్ నత్త, లిమ్నీయ లూటియోలపై మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (సుకుమారన్, అతని అనుచరులు, 2002).
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానికస్ యుర్టికె జీవిత చక్రాన్ని పొడిగించి, అధిక మరణశాతాన్ని నమోదు చేసింది (ఎల్‌గెపలి, అతని అనుచరులు, 2016).

Read More
  • 1
  • 2