యుద్ధం వలన గుడ్ల ఎగుమతులకు దెబ్బ

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పది రోజులుగా రోజుకి రూ. 4 కోట్ల విలువైన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గుడ్లు కార్గో ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. బయటి నుంచి డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఆదివారం విపణిలో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధర రూ.4.20 ఉండగా, రిటైల్ రూ. 5కు అమ్ముతున్నారు. మరోవైపు రిటైల్ అమ్మకందారులు తమ షాపుల్లోనే ఎక్కువగా ఉన్నాయని, కొత్తగా ఆర్డర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో పౌల్ట్రీఫాం యజమానులు, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ఇది పౌల్ట్రీ రంగానికి ఊహించని ఉత్పాతమని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More

బోయినపల్లి మార్కెట్‌ను పరిశీలించిన రైతు కమిషన్‌

మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి సీరియస్‌

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ నిర్వహాణపై రైతు కమిషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కెట్‌ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంపై కమిషన్‌ చైర్మన్‌ కొదండరెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకే రైతు కమిషన్‌ చైర్మన్‌తో పాటు సభ్యులు రాములు నాయక్‌, భవానీ రెడ్డి..మార్కెట్‌ను అకస్మిక తనిఖీ చేశారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఉండి.. మార్కెట్‌ యార్డులో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. చాలా సేపు మార్కెట్‌ యార్డులో తిరిగి అక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు, హామాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్కెట్‌ కార్యాలయంలోని రికార్డులను, అటెండెన్స్‌ రిజిస్టర్లను కమిషన్‌ బృందం పరిశీలించింది. గత మూడు, నాలుగు రోజులు మార్కెట్‌ సెక్రెటరీ అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంపై కమిషన్‌ చైర్మన్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధుల్లో ఉండడం చూసి.. కమిషన్‌ ఆశ్చర్యానికి లోనైంది. ఇంత పెద్ద మార్కెట్లో ఒకే ఒక అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉండడం ఏంటనీ ప్రశ్నించింది. ప్రతిరోజు బోయిన్‌పల్లి మార్కెట్‌ కు ఏఏ రాష్ట్రాల నుండి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయల వ్యర్ధాలతో గ్యాస్‌ ఉత్పత్తి చేయడానికి గతంలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు నెలల నుండి ప్లాంట్‌ నడవకపోవడంతో.. కూరగాయల వ్యర్ధాలను తరలించడానికి ప్రతినెల మార్కెట్‌ కమిటి నాలుగున్నర లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్న విషయం కమిషన్‌ దృష్టికి వచ్చింది. మార్కెట్‌ యార్డులో కూరగాయల అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలపై కమిషన్‌ ఆరా తీసింది. బోయినపల్లి మార్కెట్‌ కమిటీలో ఉద్యోగుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, షాపుల వివరాలు అన్ని కమిషన్‌కు నివేదిక రూపంలో అందించాలని సూచించింది. మార్కెట్‌ను సందర్శించిన వారిలో కమిషన్‌ అధికారులు హారివెంకట ప్రసాద్‌, మహేష్‌ నాయక్‌ తదితరులు వున్నారు.

Read More