10% సేంద్రియ ఎరువు 2030కి రసాయన ఎరువుల్లో కలపాలి

2030 నాటికి రసాయన ఎరువుల్లో తప్పనిసరిగా 10% పులియబెట్టిన సేంద్రియ ఎరువుల (ఎఫ్ఓఎం)ను కలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) పిలుపునిచ్చింది. ఇందువల్ల ఏటా ఎరువుల దిగుమతులపై 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు) ఆదా చేయొచ్చని పేర్కొంది. ‘ఎఫ్ఎం నేలకు పోషణనిస్తుంది ఇందువల్ల సుస్థిరతకు నేల పోషణనిస్తుంది’ అనే శ్వేతపత్రాన్ని ఐబీఏ సమర్పించింది. కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని ఐబీఏ తెలిపింది. దేశంలో క్షీణిస్తున్న నేల సారాన్ని పునరుద్ధరించడానికి, సుస్థిర వ్యవసాయం వైపు పరివర్తనను వేగవంతం చేయడానికి సూచనలు చేసినట్లు వివరించింది. 2030 నాటికి రసాయన ఎరువుల్లో ఎఫఎంను 10% మేర కలపడాన్ని దశల వారీగా సాదించాలని శ్వేతప్రతం ప్రతిపాదించింది. 2026-27లో 1%, 2027-28లో 3%, 2028-29లో 5%, మేర ఎఫఎఎంను రసాయన ఎరువుల్లో కలపడం తప్పనిసరి చేసి, 2030కి 10 శాతానికి చేర్చాలని ప్రతిపాదించింది. బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి ఎఫఎంను సమీకరించాలని తెలిపింది.

Read More

ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ పాలకూ తప్పనిసరి

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ పాల సంఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలు జారీ చేసింది. పాల సహకార సంఘాల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్లందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సూచించింది. అంటే ఇకపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ లేకుంటే వీళ్లు పాల వ్యాపారాలను నిర్వహించొద్దు. ‘ఇటీవల కొన్ని చోట్ల పాలల్లో కల్తీ జరిగి నట్లు వార్తలు వచ్ౘ్ిన దృష్ట్యా… రిజిస్ట్రేషన్/ లైసెన్సింగ్ నిబంధనలు పాటింపులో కఠినంగా వ్యవహరించాల’ని వారికి ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఆహార ఉత్పత్తుల వ్యాపారాల కోసం రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు తీసుకోకుండానే కొందరు పాల విక్రయదార్లు, ఉత్పత్తిదార్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. అందువల్ల పాల ఉత్పత్తిదార్లు, విక్రయదార్ల దగ్గర నిర్దిష్ట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్/లైసెన్సు ఉందా? అని పరిశీలించాల్సిందిగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అధికారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. నిల్వ ఉష్ణోగ్రతల నిర్వహణలో నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా? లేదా అని మిల్క్ చిల్లర్స్‌ను కూడా పరిశీలించాల్సిందిగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Read More

కొబ్బరికి యుద్ధం దెబ్బ

కొబ్బరి సాగుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక పెట్టింది పేరు. తమిళనాడు, ఏపీల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం దేశం లోని కొబ్బరి మార్కెట్‌పై పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో కువైట్, ఒమన్, దుబాయ్, ఇరాన్, సౌదీలకు ఎగుమతి చేసేందుకు కాయలను సిద్ధం చేశారు. అయితే యుద్ధం నేపథ్యంలో ముంబయి, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లోనే కాయలతో కంటెయినర్లు నిలిచిపోయాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఆయా దేశాలకు ఎగుమతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా ఓడరేవుల్లో ఉన్న సరకును స్థానికంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొబ్బరి ధరల పతనం..: గత నెలలో శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వెయ్యి పచ్చి కాయలు రూ.18-20 వేలు పలికాయి. కురిడీల ధరలూ బాగానే ఉన్నాయి. శ్రీరామనవమికి దేశవ్యాప్తంగా మంచి ధర వస్తుందని వ్యాపారులు ఆశించారు. ఓడరేవుల ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే కొబ్బరికాయలు అక్కడే నిలిచిపోవడంతో ధరలపై ప్రభావం చూపింది. దీంతో ప్రస్తుతం వెయ్యి కాయలు రూ.13-14 వేలకు పతనమయ్యాయని మార్కెట్ విశ్లేషకుడు అప్పన కాళీప్రసాద్ తెలిపారు.

Read More

ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం త్వరలో ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యానవర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీ పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్ౘ్ేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత, కోత అనంతరం విలువ జోడింపు వరకు స్టార్టప్‌ల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ భగవాన్, హార్టికల్ౘ్ర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రో…ర్ ఆఫ్ ఎగ్ౙామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్‌టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Read More

పెరుగుతున్న మిరప ధరలు

ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. వరంగల్ ప్రాంతంలో సాగయ్యే ఎల్లో మిర్చి (స్నాక్స్ తయారీలో వినియోగించే కారం) రకానికి రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 44 వేలు ధర పలుకుతోంది. వండర్ హాట్ రకానికి గత వారంతో పోలిస్తే ఇప్పటికి రూ.5 వేలు పెరిగి బుధవారం క్వింటా రూ.30 వేలు పలికింది. అత్యధికంగా సాగయ్యే తేజ రకం రెండు వారాల క్రితం రూ.15 వేలు పలకగా, ఇప్పుడు రూ.20,200 పలుకుతోంది. 341 రకానికి రూ. 25,600, దీపిక రకానికి రూ.26,200 ధర నడుస్తోంది.

Read More