10% సేంద్రియ ఎరువు 2030కి రసాయన ఎరువుల్లో కలపాలి
2030 నాటికి రసాయన ఎరువుల్లో తప్పనిసరిగా 10% పులియబెట్టిన సేంద్రియ ఎరువుల (ఎఫ్ఓఎం)ను కలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) పిలుపునిచ్చింది. ఇందువల్ల ఏటా ఎరువుల దిగుమతులపై 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు) ఆదా చేయొచ్చని పేర్కొంది. ‘ఎఫ్ఎం నేలకు పోషణనిస్తుంది ఇందువల్ల సుస్థిరతకు నేల పోషణనిస్తుంది’ అనే శ్వేతపత్రాన్ని ఐబీఏ సమర్పించింది. కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని ఐబీఏ తెలిపింది. దేశంలో క్షీణిస్తున్న నేల సారాన్ని పునరుద్ధరించడానికి, సుస్థిర వ్యవసాయం వైపు పరివర్తనను వేగవంతం చేయడానికి సూచనలు చేసినట్లు వివరించింది. 2030 నాటికి రసాయన ఎరువుల్లో ఎఫఎంను 10% మేర కలపడాన్ని దశల వారీగా సాదించాలని శ్వేతప్రతం ప్రతిపాదించింది. 2026-27లో 1%, 2027-28లో 3%, 2028-29లో 5%, మేర ఎఫఎఎంను రసాయన ఎరువుల్లో కలపడం తప్పనిసరి చేసి, 2030కి 10 శాతానికి చేర్చాలని ప్రతిపాదించింది. బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి ఎఫఎంను సమీకరించాలని తెలిపింది.







