వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌ ఆదేశాలు

ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తితో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌ దివాకరను ఆదేశించారు. సోమవారం ఆయన కమిషన్‌ కార్యాలయం నుంచి ఈ విషయంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి, కమిషన్‌ సభ్యులు, కలెక్టర్‌ పాల్గొన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. తాము క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు రైతులకు న్యాయం జరగలేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు పరిహారం ఇవ్వని పక్షంలో వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.