ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవు కడుపులో నుంచి బయటకు తీసిన పశువైద్యలు
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు ఇటీవల అస్వస్థతకు గురైంది. కడుపు బాగా ఉబ్బిపోయి, ఇబ్బందిపడుతుండటంతో పశువైద్యులకు చూపించారు. వైద్యులు పరీక్షించి ఆవు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని గుర్తించారు. శుక్రవారం కోవెలకుంట్ల పశుసంవర్ధకశాఖ ఏడీ డా. కిశోర్ ఆధ్వర్యంలో వైద్యులు డా. నవీన్, డా. విజయానాయక్ శస్త్రచికిత్స చేసి దాని కడుపులోంచి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు.


