ఈ నెల 9న కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపట్టిన విత్తన బంతుల ప్రాజెక్టు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల కెక్కింది. విద్యార్థులతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టును లండన్‌ కేంద్రంగా పని చేసే సంస్థ గుర్తించిందని మేయర్‌ ఆర్య ఎస్‌ రాజేంద్రన్‌ సోమవారం వెల్లడించారు. ఇందులో 6 వేల మంది విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో తిరువనంతపురంలోని పుథరీకందం మైదానంలో 4 లక్షల విత్తన బంతులను విసిరామని తెలిపారు.