రైతులకు ఖర్చు తగ్గించే డ్రోన్లు కావాలి
రైతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లను అందించాలని డ్రోన్ల తయారీదారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఒకే దఫాలో ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీతో పాటు పైరు ఎదుగుదలను పరీక్షించేలా డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెంచాలన్నారు. దాని వల్ల రైతులకు ఖర్చు తగ్గుతుందని నిన్న జరిగిన డ్రోన్ల సమ్మిట్లో ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు కూడా పాల్గొన్నారు.

