ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రం త్వరలో ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అధునాతన శాస్త్రీయ సలహాలు, సూచనలు అందించేందుకు గాను అన్ని హాంగులతో కూడిన ఉద్యాన టెక్నాలజీ సమాచార కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయంలో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి అన్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ దిలీప్ ఉద్యానవర్సిటీని సందర్శించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు విస్తరణ సేవలు మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల్లో డ్రోన్ టెక్నాలజీ పంటల చీడ, పీడల నిఘా, నియంత్రణ తద్వారా దిగుబడి, నాణ్యత పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో మోడల్ డ్రోన్ వాడకం దేశానికే ఆదర్శంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో ఆవిష్కరణల పెంపొందింపు, అంకుర పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్ౘ్ేందుకు హార్టీ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. ఉద్యాన రంగంలో మొక్కలు నాటడం మొదలుకొని కోత, కోత అనంతరం విలువ జోడింపు వరకు స్టార్టప్‌ల స్థాపనకు మేలైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ దిలీప్ తెలిపారు. రైతులు, విద్యార్థులు, ఔత్సాహికులకు ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ భగవాన్, హార్టికల్ౘ్ర్ డీన్ డాక్టర్ జె. చీనా, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. లక్ష్మీనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్ కుమార్, కంట్రో…ర్ ఆఫ్ ఎగ్ౙామినేషన్స్ డాక్టర్ ఎన్ శ్రీనివాసన్, కన్సల్‌టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, ప్రొఫెసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

రైతుమేళాలో ఆధునిక పరికరాల ప్రదర్శన

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండురోజుల రైతుమేళా రాజేంద్రనగర్‌లోని క్రీడా ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మానవరహిత వ్యవసాయ ప్రాజెక్టులో భాగంగా అగ్రివర్సిటీ సాంకేతిక కేంద్రం, ఇంజినీరింగ్ విభాగం, అగ్రి రోబోటిక్స్, ఐవోటీ సొల్యూషన్స్ ఫర్ అగ్రికల్చర్ (అరిసా) కేంద్రం రూపొందించిన రోబోలు, ఫార్మ్ రోబోలు, ఆధునిక యంత్ర పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, సేంద్రియ ఎరువులు, చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 102 స్టాళ్లను ఏర్పాటు చేయగా రైతులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా రూ.14 లక్షల విలువైన మెగాస్ప్రేయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరి నారును పొలంలో సమాన దూరంలో నాటే రైస్ ట్రాన్స్‌ప్లాంటర్ కూడా ఆకట్టుకుంది. భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆరఆర్) అభివృద్ధి చేసిన అధిక దిగుబడి విత్తన రకం డీఆరఆర్ ధాన్ 75, ఇతర రకాలను భారీగా కొనుగోలు చేశారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) చిరుధాన్యాల రకాలు, ఆహారాల తయారీ విధానాలు, యంత్రాలను ప్రదర్శించింది. ఉద్యానశాఖ నూతన విత్తన రకాలు, పౌల్ట్రీ డైరెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కొత్త కోళ్ల రకాలు, దాణా, కమ్యూనిటీ సైన్స్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన సహజ ఆహార పదార్థాలను రైతులు కోనుగోలు చేశారు.

మహిళా రైతులకు త్వరలో డ్రోన్లు

తెలంగాణలో రైతులు కోటీశ్వరులు కావాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్సిటీ, వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మెగా రైతు మేళాను పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి తుమ్మల ప్రారంభించారు. ‘వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు భవిష్యత్తులో డ్రోన్‌లు ఇస్తాం. డిమాండ్‌కు అనుగుణంగా పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం’ అని తుమ్మల తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘రైతులు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను వినియోగించుకొని ఉత్పత్తులను పెంచాలి. అగ్రివర్సిటీ నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలి’ అని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర. వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగస్వామ్యం కల్పించేలా కృషి చేస్తున్నాం’ అన్నారు.

Read More