ఎకరా వరకూ.. రైతు భరోసా నిధులు విడుదల

యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద ఆదివారం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎకరాకు రూ. 6 వేల చొప్పున విడుదల చేశారు. నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లు విడుదలయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని… ఆమేరకు బ్యాంకుల నుంచి సందేశాలు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Read More

పంటల సాగుకు అందించే రుణ పరిమితి పెంపు

వివిధ రకాల పంటల రుణాల పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెంచుతూ రాష్ట్రంలోని బ్యాంకులకు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖలు, అగ్రి, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, నాబార్డు, బ్యాంకుల అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ సమావేశమై 127 రకాల పంటల వ్యయాలు, రైతుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి సిఫార్సులు చేయగా.. రుణ పరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించింది.


వరి – రూ.48 వేలు, పత్తి – రూ.52 వేలు, మొక్కజొన్న – రూ.38 వేలు,
వేరుశనగ – రూ.34 వేలు, మిర్చి – 90 వేలు, చెరకు – 84 వేలు.

Read More