వివిధ రకాల పంటల రుణాల పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెంచుతూ రాష్ట్రంలోని బ్యాంకులకు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖలు, అగ్రి, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, నాబార్డు, బ్యాంకుల అధికారులతో కూడిన సాంకేతిక కమిటీ సమావేశమై 127 రకాల పంటల వ్యయాలు, రైతుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి సిఫార్సులు చేయగా.. రుణ పరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించింది.


వరి – రూ.48 వేలు, పత్తి – రూ.52 వేలు, మొక్కజొన్న – రూ.38 వేలు,
వేరుశనగ – రూ.34 వేలు, మిర్చి – 90 వేలు, చెరకు – 84 వేలు.