జాతీయ పశుపోషణ పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమం (నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) అమలులో అగ్రస్థానం సాధించిన తెలంగాణ పశుసంవర్ధకశాఖకు కేంద్రం ప్రశంసా పత్రం ఇచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్‌ ఈ పత్రాన్ని రాష్ట్ర అధికారులకు అందజేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం అమలులోనూ తెలంగాణ రాష్ట్ర పనితీరు ప్రశంసనీయమని కమిషనర్‌ అభినందించారు. కేంద్రం నుంచి ప్రశంసాపత్రం పొందిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, అదనపు సంచాలకురాలు మల్లీశ్వరిలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ప్రశంసించారు.