ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఆవు, గేదె జాతి పశువులకు వచ్చే నెల 29 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు తెలిపారు. తమ శాఖ సిబ్బంది పశు పోషకులు ఇళ్ల వద్దకే వెళ్లి ఈ టీకాలను ఉచితంగా అందజేస్తారని ప్రకటించారు. ఇందుకోసం 83.69 లక్షల డోసులను జిల్లాలకు సరఫరా చేశామని తెలిపారు.