వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీకి రూ.112.50 కోట్ల కేటాయింపు

రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, గొర్రులు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖరీఫ్, రబీ సాగు ఆధారంగా 2025-26 సంవత్సరానికి 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

*నిబంధనలు*

ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు యంత్రాల యూనిట్ ధరలో 50% చొప్పున, ఇతర రైతులకు 40% చొప్పున రాయితీ వర్తిస్తుంది. 40 హెచ్‌పీ వరకు సామర్థ్యం గల ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, అనుబంధ పరికరాలు, విత్తే, నాటే, తవ్వే యంత్రాలు, స్ప్రేయర్లు, స్వీయచోదక పరికరాలు, పవర్ టిల్లర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పంట కోత తర్వాత విలువ జోడింపు యంత్రాలు అందిస్తారు. లబ్ధిదారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. జిల్లాల్లో మండలాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదలవుతుంది. ఎంపికైన వారి మొబైల్ ఫోన్లకు మెనేజ్‌లు పంపిస్తారు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన 15 రోజుల్లో రైతులు పరికరానికి సంబంధించి తమ వాటా మొత్తాన్ని డీలర్లకు చెల్లించాలి. ఆర్డర్ అందాక 15 రోజుల్లో రైతులకు యంత్రాన్ని అందిస్తారు.

రాయితీపై యంత్ర పరికరాలకు రైతు సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. నచ్చిన డీలర్ వద్ద పరికరాన్ని కొనుక్కోవచ్చు. మే 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 23 నుంచి 25 వరకు లాటరీ ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి మంజూరు పత్రం ఇస్తారు. లబ్ధిదారు మే 26 నుంచి జూన్ 9లోగా తన వాటా సొమ్ము డీలర్‌కు చెల్లించాలి. మే 26 నుంచి జూన్ 26 వరకు యంత్రాలు సరఫరా చేస్తారు. జూన్ 30 నుంచి డీలర్ ఖాతాలోకి రాయితీ సొమ్ము విడుదల ప్రక్రియ మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వెబ్ సైట్: https://eseed.ap.gov.in/FM/*కౌలు రైతులూ అర్హులే* సొంత భూమి కలిగిన రైతులతో పాటు గత మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో ఈ పంటలో నమోదైన ‘కౌలు రైతు కార్డులు’ పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ హక్కుల పత్రాలున్న(ఆరఓఎఫఆర్) రైతులూ అర్హులే. 2024-25 సంవత్సరంలో రాయితీ పొందినవారు అర్హులు కాదు. కుటుంబంలో ఒక సభ్యుడే దరఖాస్తు చేసుకోవాలి. భూమి రికార్డులు, అటవీ హక్కుల పత్రాలు, ఈ-పంట తదితర సమా చారం ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేస్తారు.

Read More

23 వేల రూపాయలకు చేరువలో పామాయిల్ ధర

కరోనా సమయంలో పామాయిల్ గెలలకు గరిష్ఠంగా టన్నుకు రూ.23 వేల పైచిలుకు ధర లభించింది. అప్పటివరకు గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో, ఎన్‌టిఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించిన సాగు ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడమేగాక, మొక్కలు ఉచితంగా అందిస్తుండటంతో ఏటా సాగు పెరుగుతూ వస్తోంది. గతేడాది వరకు ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 7,500 ఎకరాల్లో సాగవగా, గడిచిన ఒక్క ఏడాదిలోనే 6,150 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. *మళ్లీ దూకుడు:* తొలుత రూ.12 వేలు ఉన్న టన్ను 2022లో గరిష్ఠంగా రూ.23,467 పలికింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు రూ.15 వేల లోపే ఉంది. గతేడాది మళ్లీ రూ.20 వేలు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 20 వేల దిగువనుండగా, గడిచిన మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే రూ.23 వేలు దాటింది.పెరుగుదల (టన్నుకు రూ.ల్లో)

జనవరిలో : 19,850

ఫిబ్రవరి మొదట్లో : 20,180

ఫిబ్రవరి చివరిలో : 21,546

మార్చిలో : 22,936

Read More

రెండు మూడు నెలలు ముందుకు ఖరీఫ్ సాగు

అన్ని రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉందని, ముందస్తు సాగు చేస్తే తుపాన్ల నుంచి తప్పించుకోవచ్చని, ఖరీఫ్ సీజన్‌ను రెండు, మూడు నెలలు ముందుకు తెస్తున్నామని, దీనిపై రైతులకు శాసనసభ్యులు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలివీ.. “క్లస్టర్ బేస్డ్ విధానంలో ఉద్యానపంటల సాగుకు ముందుకెళ్తున్నాం. వివిధ పంటల సాగుకు అనుగుణంగా జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. వ్యవసాయం నుంచి ఉద్యానసాగు వైపు రైతులు మళ్లితే లాభాలొస్తాయి. ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు గతంలో ఇచ్చినట్లే డ్రిప్‌లు, స్ప్రింక్లర్లను రాయితీపై అందిస్తాం. గతేడాది వ్యవసాయ యాంత్రీకరణకు రూ.61 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.137 కోట్లు కేటాయించాం అని అన్నారు.

Read More