ఆంధ్రప్రదేశ్‌ పీఎం కుసుమ్‌ పథకం రెండో థను 4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు అమలు చేయాలని ఇంధన శాఖ నిర్ణయించింది. దీని ప్రతిపాదనను అధికారులు కేంద్రానికి పంపారు. పథకం అమలు కోసం ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రెండోథ ప్రాజెక్టును 2026 నుంచి కేంద్రం అమలుచేయనుంది. వాటి ద్వారా 2027-28 నుంచి సుమారు 2,000 మెగావాట్ల విద్యుత్‌ వస్తుందని అంచనా. 19 శాతం కెపాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌ (సీయూఎఫ్‌)గా అధికారులు పరిగణించారు. ఈ లెక్కన సుమారు 3,200 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ ఉత్పత్తి వస్తుందని అంచనా. అప్పటికి యూనిట్‌ విద్యుత్‌ వ్యయం ఆధారంగా లెక్కిస్తే.. ఏటా సుమారు రూ. 254.04 కోట్లు విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో ఆదా అవుతుందని అధికారుల అంచనా. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) అమలులో ఉండే 25 ఏళ్లలో సుమారు రూ.6,351 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు.
మూడోవంతు కనెక్షన్లకు సౌర విద్యుత్‌

  • ఆంధ్రరాష్ట్రంలో 21 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో పీఎం కుసుమ్‌ కింద మొదటిథలో 3 లక్షల కనెక్షన్లకు సౌర విద్యుత్‌ అందించేందుకు కేంద్రం అనుమతించింది. రెండోథలో ప్రతిపాదించిన 4 లక్షలతో కలిపి.. మొత్తంగా 7 లక్షల కనెక్షన్లకు సౌర విద్యుత్‌ అందించేలా ప్రభుత్వం ప్రాజెక్టు రూపొందించింది.
  • ఏటా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం ప్రభుత్వం రాయితీ కింద సుమారు రూ.8వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తోంది. మొత్తం వ్యవసాయ కనెక్షన్లలో మూడోవంతు వాటికి సౌర విద్యుత్‌ అందించడం వల్ల ఆ మేరకు ప్రభుత్వం ఏటా చెల్లించే రాయితీ మొత్తంలో
    మిగులుతుంది.
  • ఫీడర్‌ స్థాయిలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు మహారాష్ట్రలో అమలవుతున్న విధానాన్ని అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అందుకు మెరుగైన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
    మొదటి థలో రూ.2,035 కోట్లు ఆదా
    పీఎం కుసుమ్‌ మొదటి థలో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇప్పటికే టెండరు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గుత్తేదారుల నుంచి 50 బిడ్లు దాఖలయ్యాయి. సంప్రదింపుల తర్వాత యూనిట్‌ తక్కువ ధరకు ఇచ్చేందుకు అంగీకరించిన గుత్తేదారులకు అధికారులు ఎల్‌వోఏ ఇచ్చారు.
  • మూడు డిస్కంల పరిధిలో కలిపి యూనిట్‌కు సగటున రూ.3.17 చొప్పున గుత్తేదారులు కోట్‌ చేశారు. ప్రస్తుతం ఆ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ పథకం కింద ప్రభుత్వం రాయితీగా చెల్లించే మొత్తంతో పోలిస్తే మినీ సౌర ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్‌ తీసుకోవడం వల్ల ఏటా రూ.81 కోట్లు ఆదా అవుతుందని అధికారులు లెక్కించారు.
  • పీపీఏ వ్యవధిలో 25 ఏళ్లలో రూ.2,035 కోట్లు ఆదా అవుతుందని అంచనా. మూడు డిస్కంలలో కలిపి 1,162.80 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.