అంతరించిపోతున్న మామిడి రకాల సంరక్షణ

అంతరించిపోతున్న మామిడి రకాలు పండూరు వారి మామిడి, కోలంగోవ, రాజమాను, పాపారాజు గోవ, హైదర్‌సాహెబ్, ఫిరంగి లడ్డూ, పనుకులు, నల్ల ఆండ్రస్ లాంటి రకాలను రేపటి తరానికి అందించాలనే సంకల్పంతో ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం సంరక్షిస్తోంది. ఇవే కాదు.. అరుదైన మొత్తం 24 మామిడి రకాలను జాగ్రత్తగా పెంచుతోంది. ఆయా చెట్లు ఎక్కడున్నాయో రైతుల ద్వారా తెలుసుకొని.. వాటి కొమ్మలు తెచ్చి పరిశోధనా స్థానంలో అంటుకట్టారు. ఇలా 2 నెలల కిందట ఒక్కో రకం మొక్కలు 120 చొప్పున అంటుకట్టి పెంచుతున్నారు. మంచి నాణ్యత, తెగుళ్లను తట్టుకునే వాటిని సేకరించి, సంరక్షిస్తున్నామని ఉద్యాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. రాధారాణి తెలిపారు.

Read More

మొక్కజొన్న పరిశోధనా కేంద్రంలో కీటకాల పెంపకం

మొక్కలలో పరాగ రేణువులు వ్యాప్తి చెందడానికి కీటకాలు ఎంతగానో తోడ్పడి దిగుబడి పెరుగుతుంది. అందుకోసమే ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కీటకాలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ గొట్టాల్లాంటి వెదురు పుల్లల్లో తుమ్మెద జాతి కీటకాలను ఉంచి, అవి గూళ్లు కట్టి, గుడ్లు పెట్టేలా చూస్తున్నారు. పంటలు పూత థకు వచ్చేసరికి అవి ఎగిరే థకు వస్తున్నాయి. తర్వాత ఆ మొక్క నుంచి ఈ మొక్క మీదకు వాలుతూ పరాగ సంపర్కానికి దోహదపడుతున్నాయి. రైతులు కూడా వ్యవసాయ క్షేత్రాల్లో వెదురుపుల్లలను అమర్చితే పంటలకు మేలుచేసే కీటకాలు వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్త డాక్టర్‌ కె. మోహనరావు తెలిపారు.

Read More