జీడి, మిర్చి, మామిడి రైతుల ప్రయోజనాల కోసం బోర్డులు ఏర్పాటు చేయమని కేంద్రమంత్రిని కోరిన లోకేశ్‌

‘జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్‌ వ్యవస్థ ఆధునికీకరణ, సరైన మార్కెటింగ్‌ కోసం జీడి బోర్డు అవసరం. మిర్చి బోర్డు ఏర్పాటైతే ధరల హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ పంటలు సాగు చేసే రైతుల కష్టాలు తొలగడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జీడి, గుంటూరులో మిర్చి, చిత్తూరులో మామిడి బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రవాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండల్లో 4 కొత్త పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేసేందుకు అనుమతులివ్వాలి. నీరు, విద్యుత్తు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.5,811 కోట్ల గ్రాంట్‌ మంజూరు చేయండి. విజయవాడ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కు అనుమతివ్వాలి. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల మాస్టర్‌ప్లాన్లు ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఈపీసీ విడుదలకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఆమోదం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేశారు.

Read More

గ్రామీణ రైతు ఇంట ‘కోటి’ వెలుగులు

‘నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌’ కింద రూ. కోటి రుణం
రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం అందుకున్న తొలి రైతు!
మారుమూల పల్లెలోని ఓ రైతు ఇంట జాతీయ పథకం సిరులజల్లు కురిపించింది. చిన్న పరిశ్రమల ఏర్పాటులో రైతులకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న ‘నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌’ను సద్వినియోగం చేసుకోవడంతో రూ. కోటి రుణం మంజూరైంది. ఇందులో 50 శాతం రాయితీ కాగా… రూ. 50 లక్షలను ఆయన తిరిగి చెల్లించాలి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని అరికెల గ్రామ పంచాయతీ, గోసువారిపల్లెకు చెందిన రైతు చిన్నరెడ్డెప్పరెడ్డి… గొర్రెల పెంపకం యూనిట్‌ ఏర్పాటు నిమిత్తం ఈ మొత్తం అందుకున్నారు. ఈ చెక్కును మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘనస్వరూప్‌ రైతుకు గురువారం అందజేశారు. ‘రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని ఓ మారుమూల ప్రాంత రైతు సద్వినియోగం చేసుకోవడం ఆహ్వానించదగినది. ఏ పథకం కిందనైనా ఓ రైతు ఇంత మొత్తంలో రుణం అందుకోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మదనపల్లె పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఏడీఏ రోహిణి, పశువైద్యాధికారి లారెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి గుర్తింపునకు కృషి

నూజివీడు మార్కెట్‌ యార్డు ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి మామిడి రైతులు, వ్యాపారులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చ జరిగింది. వచ్చే మామిడి సీజనుకు నూజివీడులో మామిడి మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు, అభివృద్ధికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని, ఫ్రూట్‌ కవర్లు అందించటానికి చర్యలు తీసుకుంటామని, మామిడి రైతులకు అవసరమయిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి, నూజివీడు మామిడికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు రావడానికి తగిన చర్యలు వ్యవసాయ శాఖ మంత్రితో సంప్రదించి తీసుకుంటామని రైతులకు మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.

Read More

ఐ.ఏ.ఎస్‌. అధికారులూ… పొలాలకు వెళ్ళండి

ఐ.ఏ.ఎస్‌. అధికారులు సచివాలయంకే పరిమితం కాకుండా అవకాశం ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి రైతులతో కలిసి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని బుధవారం వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐ.ఏ.ఎస్‌.లను ఆదేశించారు. పాతవిధానంలోనే రైతు భాగస్వామ్యంతోనే బీమా అమలు చేయాలని, పంట కాలువలలో గుర్రపుడెక్క తొలగించి పూడిక తీయాలని, సాగునీటికి కొరత లేకుండా చూడాలని, వృధాగా పోయే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించాలని, ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Read More

పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేశారు

ఐదేళ్ళ తరువాత గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు పారుతున్నాయి. ఇందుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుండి కాలువ నుంచి 16 పంపుల ద్వారా 5600 క్యూసెక్కుల నీరు ఈరోజు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాల వలన నీటి ప్రవాహం పెరుగుతున్నందువలన నీటిని ఈ రోజు విడుదల చేయడం జరిగిందని అధికారులు తెలియచేశారు. గోదావరి జలాలు కృష్ణాడెల్టాలో పారితే వరి దిగుబడులు పెరుగుతాయని 2016 ఖరీఫ్‌ సీజనులో ఋజువయ్యింది. కాని 2019 నుంచి 2023 వరకు గోదావరి జలాలు లేక వరి దిగుబడులు తగ్గాయి. మళ్లీ ఈ ఏడాది పట్టిసీమ నీరు అందుతుందనే వార్త రైతుల్లో ఆనందం నింపుతోంది.

Read More

గోదావరి ఎత్తిపోతల పథకాల వద్ద నీటిమట్టం పెరుగుతుంది

గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు పెరుగుతుండటం వలన ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతూ ఉంది. సీతానగరం మండలంలోని గోదావరి ఎడమ గట్టున పురుషోత్తమపట్నం, పుష్కర, తొర్రిగడ్డ, సత్యసాయి తదితర ప్రాజెక్టుల వద్ద సోమవారం నాటికి నీటిమట్టం 14.2 మీటర్లకు చేరింది. మోటార్లు ఆన్‌ చేస్తే నీరు విడుదలయ్యేలా ప్రవాహం చేరింది. జులై రెండో వారానికల్లా ప్రాజెక్టుల నుంచి మెట్ట ప్రాంతానికి సాగు నీరు విడుదల చేసేలా కార్యాచరణ ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

Read More

బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి

తెలంగాణా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత రైతులకు వరప్రదాయిని అయన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎగువ భాగంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు సోమవారం తెరుచుకున్నాయి. తెలంగాణ మరియు మహారాష్ట్రకు చెందిన ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బాబ్లీ ప్రాజెక్ట్‌కు ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. గేట్లు ఎత్తిన సమయంలో ప్రాజెక్ట్‌లో 0.2 టి.యం.సీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమైన జులై 1వ తేదీ నుంచి బాబ్లీ గేట్లను తెరచి అక్టోబరు 28వ తేదీన మూసి వేస్తారు. ఈపరిణామంతో నిజామాబాద్‌ రెంటల్‌ మండలం కందకుర్తి, త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది.

Read More