రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More

ప్రజా ప్రయోజనాల కోసమే కేవీకేలు పని చేస్తున్నాయి

ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండే షన్ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు వసతి గృహాన్ని, విలువ ఆధారిత ఉత్పత్తుల ఆహార శుద్ధి ప్రయోగశాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అన్నదాతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధంగా కేవీకేలు కృషి చేస్తున్నాయన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాల కోసమే కేవీకేలు పనిచేస్తున్నాయని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డీజీ మంగీలాల్ ఝాట్, అటార్నీ డైరెక్టర్ షేఖ్ ఎన్‌మీరా, అఖిల భారతీయ కార్యకారిణి సదస్య బాగయ్య తదితరులు మాట్లాడారు. అంతర్ౙాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తునికి సర్పంచి ధనలక్ష్మిని కేంద్ర మంత్రి సంజయ్ సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

Read More