40 శాతం రాయతీపై డ్రోన్లు
రైతులకు ఈ ఏడాది వ్యక్తిగత యంత్రపరికరాలు ఇవ్వాలని.. డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు కేటాయించింది. రూ87.50 కోట్లతో 875 యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి 40% రాయితీపై డ్రోన్లు ఇవ్వనున్నారు. డ్రోన్ల సాంకేతికతను ప్రోత్సహించేందుకురూ.35 కోట్లు, ఆర్కేవీవై పథకాలకు రూ.1,061 కోట్లు కేటాయించారు.
2024-25 ఏడాదిలో 4.50 లక్షల మట్టి నమూనాలు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికి రూ. 18.35 కోట్లు కేటాయించారు. డ్రై కెమిస్ట్రీ విధానంలో చేపట్టనున్న ఈ పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఆల్ఫా స్ప్రెక్ట్రోస్కోపి ద్వారా మట్టి నమూనాలను స్ప్రెక్టల్ లైబ్రరీలో భద్రపరుస్తారు. వాటి ఆధారంగా తర్వాత ఉపగ్రహ చిత్రాలతో మట్టి నమూనాలను విశ్లేషించి, రియల్టైమ్లో కృత్రిమ మేథ ద్వారా ఫలితాలు రాబడతారు.


