వ్యవసాయ పట్టభద్రులకు మెగా ఉద్యోగ మేళా

వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రంలోని వ్యవసాయ పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మెగా ఉద్యోగ మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో సోమవారం ప్రారంభమైన ఉద్యోగ మేళాను ఈ నెల 26 వరకు నిర్వహించనున్నారు. తొలిరోజున వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్, వ్యవసాయ ఇంజినీరింగ్ తొమ్మిది అనుబంధ కళాశాలల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీ.హెచ్.డీ విద్యార్థులు హాజరయ్యారు. 13 సంస్థల ప్రతినిధులు పాల్గొని మౌఖిక పరీక్షలు నిర్వహించి 140 మందిని పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

Read More

‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు 8 నుంచి కౌన్సెలింగ్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ‘అగ్రి’ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ”ర్యాంకులు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజు మొత్తం తీసుకురావాలి. కౌన్సెలింగ్‌ తేదీల వారీగా ర్యాంకులు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించండి” అని స్పష్టం చేశారు.

Read More