కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్‌ చౌధరి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ – భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐసిఏఆర్‌-ఐఐఎంఆర్‌) ప్రాంగణంలో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ మిల్లెట్స్‌ (సీఓఈ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంస్థ సిరిధాన్యాల పరిశోధన, అభివృద్ధి, శిక్షణ మరియు ప్రాచుర్యం దిశగా కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.