ఇజ్రాయెల్ కంపెనీ ప్రతినిధులు తుమ్మల నాగేశ్వరరావుతో మర్యాదపూర్వక భేటీ
ఇజ్రాయెల్ కంపెనీ యం.డి. హెచ్ఏఐ ఆర్ అండ్ డి ప్రతినిధులు మరియు విండ్ పొనిక్స్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి, వారి సంస్థ ద్వారా వ్యవసాయరంగంలో చేపడుతున్న కార్యక్రమాలను మంత్రికి వివరించడం జరిగింది. స్మార్ట్ అగ్రికల్చర్, ఏ.ఐ సెన్సార్ మరియు ఆటోమేషన్ పద్ధతులు, డిజిటల్ రెయిన్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్ మెంట్ వంటి పద్ధతులపై వివరించి ఇజ్రాయిల్ మరియు భారతదేశం మధ్య కుదిరిన ఒప్పందం అనుసరించి యం.డి. హెచ్ఏఐ ఆర్ అండ్ డి భాగస్వామ్యంతో, తెలంగాణ రాష్ట్రంలో పైలట్ పద్ధతిలో వ్యవసాయరంగములో వస్తున్న ఆధునిక టెక్నాలజీని మన దగ్గర రైతులకు శిక్షణ ఇచ్చేందుకు, విండ్ పొనిక్స్ సంస్థ సిద్ధంగా ఉందని, అదేవిధంగా యూనివర్సిటీల మధ్య కూడా ఒప్పందాల ద్వారా ఇజ్రాయిల్ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రములో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
దానికి మంత్రి స్పందిస్తూ, తాను 1995 సంవత్సరములో ఇజ్రాయిల్ దేశంలో పర్యటించినపుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రోత్సహముతో ప్రవేశపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ ప్రాచుర్యంలోకి రావడానికి దాదాపు 25 ఏళ్లు పట్టిందని, అదేవిధంగా కొత్త టెక్నాలజీని ఒడిసిపట్టి, అది మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి రైతులకు సేద్యరంగములో తోడ్పడేందుకు తమ ప్రభుత్వము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని, త్వరలోనే సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో సమావేశమై, వారి ప్రాజెక్ట్ నివేదికను సమర్పించాల్సిందిగా ఆ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.



