పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు సడలించాలి

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) 18% తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో దీనిపై మాట్లాడారు. ”పత్తి కొనుగోలు చేయాలంటే అందులో తేమశాతం 8-12%కి మించకూడదన్న నిబంధన రైతులకు గుది బండగా మారింది. ఆంధ్రరాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా తీరప్రాంతంలో తేమశాతం దీనికంటే ఎక్కువగా ఉంటుంది. రైతులకు ఎల్‌1/ఎల్‌2/ఎల్‌ జిన్నింగ్‌ మిల్లులు కేటాయించడం వల్ల వాళ్లు తమ సమీపంలో ఉన్న మిల్లులను ఎంచుకొనే వీల్లేకుండా పోతోంది. దానివల్ల వారు తక్కువ ధరలకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేలో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సీసీఐ నిబం ధనలను సడలించాలి. అదే సమయంలో అన్ని జిన్నింగ్‌ మిల్లులను తెరిచి 18% వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలుచేసి ఆ నిష్పత్తి ప్రకారం కనీస మద్దతు ధర చెల్లించేలా నిర్దేశించాలి. వర్షం నీరు తాకిన, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రైతులు ఇప్పటికే పలు వైపరీత్యాలతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలతో వారి కష్టాలను రెట్టింపు చేయడం భావ్యం కాదు. వ్యవసాయదారుల జీవనోపాధిని రక్షించి, రాష్ట్రంలో పత్తిసాగును కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ యేటా 20 లక్షల బేళ్లు అందిస్తోంది. 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 5.39 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే మొంథా తీవ్రతుపాను కారణంగా 1.08 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. సుమారు 1.25 లక్షల టన్నుల పత్తి రంగుమారింది. తీరప్రాంతంలోని ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని రైతులు తీవ్ర ప్రభావానికి గురయ్యారు” అని లావు పేర్కొన్నారు.

Read More

మార్కెటింగ్‌, మార్క్‌ ఫెడ్‌, హాకా, ఆర్‌ఐసి సంస్థల ఎండీలతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష

తెలంగాణా రాష్ట్రంలో వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణ, మరియు మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వరి ధాన్య సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు, మున్నగు వాటి జిల్లాల వారి లభ్యతపై సమీక్షించారు.
మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, ఐనప్పటికి రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు రేపటి నుండి మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాలు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సిసిఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. కావున వెంటనే కలెక్టర్లు జిన్నింగ్‌ సెంటర్లు రేపటిలోగా నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌ఓడీని అన్ని పంటల కొనుగోళ్లకు సమన్వయ అధికారిగా నియమించడం జరిగిందని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు ఎండి, వేర్‌ హౌజ్‌, వరంగల్‌ జిల్లాకు డైరెక్టర్‌, హార్టీకల్చర్‌, నల్లగొండ జిల్లాకు డైరెక్టర్‌, అగ్రికల్చర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ఎండి, హాకా, ఖమ్మం జిల్లాకు డైరెక్టర్‌ మార్కెటింగ్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు డైరెక్టర్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌, కరీంనగర్‌ జిల్లాకు ఎండి, ఆగ్రోస్‌, మెదక్‌ జిల్లాకు ఎండి, మార్క్‌ ఫెడ్‌, రంగారెడ్డి జిల్లాకు ఎండి, ఆయిల్‌ ఫెడ్‌ గార్ల స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, హాకా ఎండీ చంథ్రేఖర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More