తూర్పుగోదావరి జిల్లాలో ‘3ఎఫ్‌ ఆయిల్‌ పామ్‌’ ప్రాసెసింగ్‌ సంస్థ రూ. 300 కోట్లతో తమ వ్యాపారాన్ని విస్తరించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. ఆ సంస్థ ఎండీ సంజయ్‌ గోయెంక, డైరెక్టర్‌ ఆశిశ్‌ గోయెంక ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్థం రూ. కోటి చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు.