సప్తధాన్యాలను పాత్రలో వేసి నానిన తర్వాత మొలక కట్టాలి (విడివిడిగా).

  1. 100 గ్రా. పెసలు (మొలకలు)
  2. 100 గ్రా. మినుములు (మొలకలు)
  3. 100 గ్రా. అలసందలు (మొలకలు)
  4. 100 గ్రా. శనగలు (మొలకలు)
  5. 100 గ్రా. నువ్వులు (మొలకలు)
  6. 100 గ్రా. ఉలవలు (మొలకలు)
  7. 100 గ్రా. గోధుమలు (మొలకలు)

తడిగుడ్డతో వేలాడకట్టి మొలక వచ్చాక అన్ని కలిపి రుబ్బి ఒక లీ. నీరు కలపాలి. 10 లీ. ఆవు మూత్రం కలపాలి. కర్రతో బాగా కలియ త్రిప్పాలి. 2 గంటలు అలాగే ఉంచితే ఘనపదార్థం అడుగుకి చేరుతుంది. ఆ కషాయం వడపోసి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది 48 గంటలు నిలువ ఉంటుంది. పైరు పాలు పోసుకునేటప్పుడు అన్ని పంటలకు పిచికారి చేస్తే దిగుబడి, గింజ నాణ్యత పెరుగుతుంది.