వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లోనూ ఖాళీల భర్తీ

  • వివరాలు కోరిన ప్రభుత్వం
  • ఆ మూడింట్లో 718 పోస్టులు ఖాళీ

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాలతోపాటు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లోని ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ఖాళీలు, ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం, ఇతరత్రా అంశాలపై సమాచారం కోరింది. మూడు వర్సిటీల్లో మొత్తం 718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం చివరి దఫా నియామకాలు జరిగాయి. పశువైద్య వర్సిటీలో 2022లో నియామకాల ప్రక్రియ చేపట్టి రెండు నెలల క్రితం భర్తీ చేశారు. ఈలోపు మళ్లీ ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి నల్గొండలతోపాటు కొడంగల్‌లో మూడు కొత్త కళాశాలలు, పశువైద్య వర్సిటీ పరిధిలో కొడంగల్‌ ఓ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ, కొత్త నియామకాలు అవసరమని ఆయా వర్సిటీల పాలకవర్గాలు గుర్తించాయి. ఖాళీల వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఉపకులపతులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు ఈ మూడు వర్సిటీల్లోని ఖాళీల వివరాలు అడిగింది.

నియామకాలకు ఏ విధానం?
ఉన్నత విద్యాశాఖ పరిధిలో సహాయ ఆచార్యుల పోస్టులను ప్రత్యక్ష నియామక విధానం ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. తాజా ఉత్తర్వుల్లో వీటి ప్రస్తావన లేదు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన తర్వాత అవే మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశిస్తే పాలకమండళ్లు అమలు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో మూడు వర్సిటీలు అవే మార్గదర్శకాలను తాము అమలు (అడాప్ట్‌) చేస్తామని తీర్మానం చేయాలి. ప్రత్యేక విధానం తేవాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రస్తుతం వేయి మందికి పైగా పీహెచ్‌డీ అభ్యర్థులు పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఖాళీల భర్తీ చేపడితే తమకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు.

Read More

ప్రకృతి.. సేంద్రియ వ్యవసాయం పెంచండి

గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారులు సంఘాల (ఎఫ్‌పీవో) ఏర్పాటు ద్వారా సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తులు ధ్రువీకరణ సంస్థ చైర్మన్‌ శావల దేవదత్‌ సూచించారు. తిరువూరులో బుధవారం నియోజకవర్గంలోని వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామ సహాయకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 66 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అందులో 2,300 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి నిధులు అధికంగా కేటాయిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణం పెంచాలన్నారు. డీఏవో విజయకుమారి, ఏడీఏ కెనడి పాల్గొన్నారు.

Read More

సీటొస్తే… కొలువు గ్యారంటీ!

15 ఏళ్లుగా వంద శాతం ప్రాంగణ నియామకాలు
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలకూ అవకాశం
‘నార్మ్‌’లో పీజీడిప్లొమా కోర్సు

ఇక్కడ సీటొస్తే చాలు.. మంచి వేతనాలతో ఉద్యోగం లభిస్తోంది. కోర్సులో చేరిన విద్యార్థులు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. ఇదీ హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌) ఘనత. ఇక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఏబీఎం) కోర్సును పూర్తిచేసినవారు 100% ఉద్యోగాలు పొందుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తవగానే విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు ప్రారంభమవుతున్నాయి. ఏఐసీటీఈతో పాటు 'న్యాక్‌' గుర్తింపుపొందిన ఈ వ్యవసాయ అనుబంధ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది.

వ్యవసాయ పరిశోధనలో మేటిగా…
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌)కి అనుబంధంగా వ్యవసాయ పరిశోధన విద్యా నిర్వహణకు సంబంధించి 1976లో నార్మ్‌ ఏర్పాటయింది. వ్యవసాయ పరిశోధనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం.. మెరుగైన సలహాలను అందించడంతో పాటు రైతులు, శాస్త్రవేత్తలతో సహా వివిధ వాటాదారులకు పేటెంట్లు వంటివి లభించేందుకు నార్మ్‌ కృషి చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పారిశ్రామిక, వ్యాపార రంగాల అధ్యయనాలను సమ్మిళితం చేసి సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా 2009లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. 2019 వరకు ఇది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లామా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అగ్రికల్చర్‌ (పీజీడీఎంఏ) పేరిట ఉండేది. 2020 నుంచి దాన్ని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ – అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఏబీఎం)గా నిర్వహిస్తున్నారు.

ప్రతిభావంతులకు పట్టం…
బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య నాలుగేళ్ళ కోర్సులు ఉత్తీర్ణులైన వారు క్యాట్‌, సీమాట్‌ పరీక్షలు రాయాలి. అర్హత సాధించినవారు నార్మ్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. పీజీడీఎం-ఎంబీఎంలో 60 సీట్లు ఉండగా… ఏటా వెయ్యిమందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు ఎనలిటికల్‌ రైటింగ్‌స్కిల్స్‌ టెస్ట్‌, బృందచర్చలు, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికే ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాసంస్థల మాదిరే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ప్రవేశాలు పొందినవారికి ఒక్కో విద్యార్థికి ఒక్కో గది చొప్పున హాస్టల్‌ వసతి ఉంటుంది. విశాలమైన తరగతి గదులుంటాయి. జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులం ఉంటుంది. బోధకుల్లో 70% మంది శాస్త్రవేత్తలు, నిపుణులు ఉండగా.. 30% మంది పారిశ్రామికరంగం నుంచి వచ్చి బోధన చేస్తారు. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలతో పాటు అసైన్‌మెంట్లు, కేస్‌ స్టడీస్‌, ముఖాముఖి చర్చలు, పారిశ్రామిక ప్రముఖులతో భేటీలు, క్షేత్రస్థాయి పరిశీలనలు వంటివి ఉంటాయి. సెమినార్లు, వర్క్‌షాపులు, సింపోజియాలలోనూ పాల్గొంటారు. వారికి కార్పొరేట్‌ కంపెనీల కోసం కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పిస్తారు. రెండేళ్ళ కోర్సులో ఆరు ట్రిమిస్టర్లు ఉంటాయి. ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్న్‌షిప్‌, ప్రజెంటేషన్‌ స్కిల్స్‌, సప్లైచెయిన్‌, రాజకీయ, ఆర్థిక తరగతులు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.

  • మూడో ట్రిమిస్టర్‌ నుంచే కంపెనీలు నార్మ్‌కు వచ్చి విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేసుకుంటున్నాయి. ఐదో ట్రిమిస్టర్‌ లోనూ మళ్లీ కంపెనీలు వచ్చి ఇంటర్న్‌షిప్‌ ఇస్తున్నాయి. అది పూర్తయిన వెంటనే ప్రాంగణ నియామకాలు మొదలవుతున్నాయి. విద్యార్థలకు శిక్షణ ఇచ్చిన కంపెనీలే సగానికి పైగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తుండగా.. మిగిలినవారిని ఇతర కంపెనీలు ఎంపిక చేస్తున్నాయి.
  • వ్యవసాయ, విత్తన, ఎరువులు, పురుగు మందులు, పశువైద్య, మత్స్య, జీవశాస్త్ర, బ్యాంకింగ్‌ ఆర్థిక, బీమా, వాణిజ్య సంస్థలు, గృహోపకరణాలు, అగ్రిటెక్‌ తదితర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇంతవరకు నియమితులైనవారికి సగటున రూ. 10.7 లక్షల ప్యాకేజీ ఉంది. గత ఏడాది అత్యధికంగా రూ. 15 లక్షల ప్యాకేజీ వచ్చింది. నార్మ్‌లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులో 50% మేరకు అమ్మాయిలు ఉంటున్నారు.

సీట్ల సంఖ్య రెట్టింపునకు యోచన
‘మా విద్యార్థులు మెరికలు. 15 ఏళ్లుగా ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందారు. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సీట్ల సంఖ్యకు 120కి పెంచాలని ఆలోచిస్తున్నాం’ అని నార్మ్‌ ప్రాంగణ నియామకాల సమన్వయకర్త గణేశ్‌కుమార్‌ తెలిపారు. ‘ఈ కోర్సులో చేరిన వారు 15 ఏళ్ళుగా వంథాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. క్రమశిక్షణతో పాటు పర్యావరణ హితమైన వాతావరణంలో తరగతులు సాగుతున్నాయి. ఉద్యోగాలు పొందిన వారు వ్యవసాయ రంగానికి గణనీయమైన సేవలందిస్తున్నారు’ అని చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ అనీజా తెలిపారు.

Read More

గల్ఫ్‌కు ‘అనంత’ అరటి…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పండించిన అరటి దిగుబడులతో ‘బనానా రైలు’ శుక్రవారం ముంబైకి బయల్దేరింది. తాడిపత్రి నుంచి శుక్రవారం బయల్దేరిన ఈ రైలును వర్చువల్‌ విధానంలో విజయవాడ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ ప్రారంభించారు. ఈ ఏడాది లక్ష టన్నుల అరటి ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సౌదీ, ఇరాన్‌, ఇరాక్‌, ఖతర్‌, ఈజిప్టు వంటి దేశాలకు 15 కంపెనీల ద్వారా అరటి ఎగుమతి అవుతోందని తెలిపారు.

Read More

వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం 47% నుంచి 194% పెంపు

వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పెట్టుబడి సాయాన్ని గణనీయంగా పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంతో పోలిస్తే పెట్టుబడి సాయం భారీగా పెరిగింది.
వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం (హెక్టారుకు రూపాయల్లో)
పంట ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ప్రకటించిన పెరుగుదల
ఎస్‌డీఆర్‌ఎ సాయం శాతం
ప్రకారం
వరి, వేరుశనగ, పత్తి, చెరకు 17,000 25,000 47.05
చిరుధాన్యాలు, నువ్వులు, ఆముదం, జూట్‌ 8,500 15,000 76.47
మినుము, పెసర, కంది, సోయా,
పొద్దుతిరుగుడు, పొగాకు 10,000 15,000 50.0
మొక్కజొన్న 12,500 15,000 20.0
అరటి 25,000 35,000 40.0
పసుపు, మిరప, కంద 17,000 35,000 105.88
ఉల్లి, టమాట, బొప్పాయి,
కూరగాయలు, పూలు, నర్సరీలు 17,000 25,000 47.05
జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ,
సపోట, జీడి, డ్రాగన్‌ 22,500 35,000 55.55
కొత్తిమీర 8,500 25,000 194.11
కర్రపెండలం 8,500 10,000 17.65
ఆయిల్‌పామ్‌ 22,500 చెట్టుకు
రూ. 1,500
కొబ్బరి 1,000 1,500 50

Read More