పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. వైకుంఠపు పాపారావుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌లో రాష్ట్రీయ కృషి విజ్ఞాన జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఐసీఏఆర్‌ స్థాపన దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.