కేంద్ర విత్తన చట్టంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల చట్టాన్ని చేర్చాలి

తెలంగాణ ఉద్యాన నర్సరీల నమోదు (నియంత్రణ) చట్టం-2010ని కేంద్ర విత్తన చట్టం-2025లో చేర్చాలని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖను కోరింది. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి నేతృత్వంలో కేంద్ర విత్తనచట్టం ముసాయిదా కోసం రూపొందించిన ప్రతిపాదనలను గురువారం కేంద్రానికి పంపింది. ‘ప్రైవేటు కూరగాయల విత్తనాలు, పండ్ల నర్సరీలను నియంత్రించడంలో తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్‌ నియంత్రణ చట్టం విజయం సాధించింది. రైతులు ప్రయోజనాల పరిరక్షణతో పాటు లైసెన్సును తనిఖీ చేయడం, నిలిపివేయడం, రద్దు చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పించింది. దీనిని నమూనాగా తీసుకొని భారతదేశ ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర విత్తన చట్టం రూపొందించాలి’ అని ఉద్యాన వర్సిటీ కేంద్రాన్ని అభ్యర్థించింది.

Read More

సన్న వడ్లకు బోనస్‌ వలన ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది

వరి సన్నాలకు బోనస్‌ ఇవ్వడంతో దాని సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల ఇతర పంటల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. సోమవారం ఆయన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ నిపుణుడు నరసింహారెడ్డి, కమిషన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. ఆ పంటల విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలన్నారు. కొత్త విత్తన చట్టం వస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.

Read More