ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు వర్షాలు..!
ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

