వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య శనివారం మృతిచెందారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన ఈ 85 సంవత్సరాల మొక్కల ప్రేమికుడు ఇంటిపేరునే వనజీవిగా మార్చుకుని జీవితమంతా కోటికి పైగా మొక్కలు నాటి, పెంచి సరికొత్త చరిత్ర సృష్టించినందుకు 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ పర్యావరణవేత్తను అదే సంవత్సరం ‘రైతునేస్తం’ పురస్కారాల్లో ‘ప్రకృతిరత్న’ బిరుదుతో సత్కరించింది. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు రైతునేస్తం సంపాదకులు యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు.


