ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఏర్పడింది. వరంగల్ ప్రాంతంలో సాగయ్యే ఎల్లో మిర్చి (స్నాక్స్ తయారీలో వినియోగించే కారం) రకానికి రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 44 వేలు ధర పలుకుతోంది. వండర్ హాట్ రకానికి గత వారంతో పోలిస్తే ఇప్పటికి రూ.5 వేలు పెరిగి బుధవారం క్వింటా రూ.30 వేలు పలికింది. అత్యధికంగా సాగయ్యే తేజ రకం రెండు వారాల క్రితం రూ.15 వేలు పలకగా, ఇప్పుడు రూ.20,200 పలుకుతోంది. 341 రకానికి రూ. 25,600, దీపిక రకానికి రూ.26,200 ధర నడుస్తోంది.