రొయ్యల మేత ముడిసరుకుల ధరలపై కేంద్రం జోక్యం
రొయ్యల మేత సహా ఆక్వా రంగానికి సంబంధించిన నిర్ణయాలు రైతులు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదించిన తర్వాతే తీసుకునేలా చూడాలని భారత రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్రాజు కోరారు. మేత తయారీకి వాడే ముడిసరకుల ధరలపై కేంద్రం జోక్యం కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాయడంపై కృతజ్ఞతలు తెలిపారు. మేత ధరల పెరుగుదలతో రైతుల మనుగడ, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ప్రభుత్వ జోక్యంతోనే మేత ధరల పెంపును 15వ తేదీ వరకు తయారీదారుల సంఘం వాయిదా వేసిందని వెల్లడించారు

