చెదిరిన రైతు కుటుంబాల పిల్లలకు విద్యాదానం చేస్తున్న సాయి సంస్థాన్

రైతులు అప్పులు, పంటనష్టాల వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడితే.. వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలామంది చదువును మధ్యలోనే ఆపినేసి, కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తోంది. ఇలాంటి రైతు కుటుంబాలకు అండగా మహారాష్ట్రలోని శిర్డీ సాయి బాబా సంస్థాన్ ట్రస్టు ఓ ముందడుగు వేసింది. చదువులో ప్రతిభ కనబరిచే బాధిత కుటుంబాల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్నిప్రారంభించింది. 10వ తరగతి పరీక్షలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాదించిన విద్యార్థులకు స్థానిక విద్యాప్రాంగణంలో 11, 12 తరగతులకు పూర్తి ఉచితవిద్యను అందిస్తున్నారు. ఈ పిల్లలకు ఇంజినీరింగు, వైద్యవిద్యకు అవసరమైన ప్రవేశ పరీక్షల శిక్షణ ఫీజులను సైతం సంస్థే చెల్లిస్తుంది.

Read More

రైతన్నా మీ కోసం’ తొలి రోజు 4.07 లక్షల కుటుంబాల వద్దకు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రైతన్నా.. మీ కోసం’ వారోత్సవాల మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు సేవా కేంద్రం యూనిట్‌గా వ్యవసాయ / ఉద్యాన/పట్టు సహాయకుడు, పశుసంవర్ధక/మత్స్య సహాయకుడు, గ్రామ రెవెన్యూ అధికారి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఎనర్జీ అసిస్టెంట్‌, అభ్యుదయ రైతు, సహకార పరపతి సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, మార్కెట్‌ కమిటీల సభ్యులు బృందంగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ‘సీఎం చంద్రబాబు రాసిన లేఖ అందించడంతోపాటు రైతు సంక్షేమంపై కరపత్రాలు, పంచసూత్రాలతో పాటు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ వివరాలు రైతులకు తెలియజేయాలి. ప్రతి ఆర్‌ఎస్‌కే బృందం ఆరు రోజుల్లో 540 కుటుంబాల్ని చేరుకోవాలి. 24 నుంచి 29వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం చేయాలి. నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు రైతు కుటుంబాల వారీగా సమాచారం సేకరించాలి. డిసెంబరు 3న సదస్సు నిర్వహించి 2026-27 వార్షిక ప్రణాళిక తయారుచేయాలి’ అని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71.58 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం 8,451 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 11. 93 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. 4.07 లక్షల కుటుంబాల వద్దకు బృందాలు వెళ్లాయి. అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో లక్ష్యంలో 50% పైగా సాధించారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో లక్ష్యంలో 30% లోపే ఉంది.

Read More