4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్‌ చేసిన కోదండరెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేశారు రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి. ఈరోజు ఇబ్రహీం పట్నం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్‌ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబంధించిన అధికారికంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురువారం ముగిసింది. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ హర్షన్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్‌, కమిషన్‌ అధికారి హరివెంకట ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read More

పాడి రైతులకు అండగా పశువుల బీమా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న పశువుల బీమా పథకం పాడి రైతులను ఆదుకుంటోంది. ఇటీవల అంతుపట్టని వ్యాధులు, విద్యుత్‌ఘాతాలు, చెరువులు, నదీ జలాల్లో పశువులు మునిగి చనిపోవడం వంటి ఘటనల వలన ఆసరాగా ఉంటున్న పాడి పశువు మృతితో పోషకులు జీవనోపాధి కోల్పోతున్నారు. మరో పాడి పశువు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలకు బీమా పథకంలో చేరడం ఒక్కటే పరిష్కార మార్గమని పశువైద్యాధికారి కె. మాధవ రావు సూచిస్తున్నారు.

  • 80 శాతం రాయితీపై గేదెలు, ఆవులకు పథకం అమలు చేస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది.
  • ఒకసారి బీమా చెల్లిస్తే మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది.
  • పశువుకు చెవి పోగు వేయించి బీమా నమోదు చేసుకోవాలి.
  • పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రం, సమీప పశు వైద్యశాలలో సంప్రదించాలి.
Read More

పంటలలో తెగుళ్ల ఉధృతి నమోదు ఏవోలు చేయాలి





ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంటల్లో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు వారంలో ఒకరోజు పర్యటించి, తెగుళ్ళ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఈ-పంట, డిజిటల్‌ అప్లికేషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 4,41,167 ఎకరాల్లో 1,65,843 మంది రైతులకు సంబంధించి పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేశాం. బహువార్షిక ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఉద్యాన పంటల నమోదు సమయంలో పంటల రకాలను పేర్కొనాలని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు వివరించారు.

Read More