కూరగాయల సాగులో కేరళ విధానం అమలు చేయాలి: కోదండరెడ్డి

కూరగాయల సాగు, మార్కెటింగ్‌లో కేరళ విధానం ఆదర్శంగా ఉందని, దానిని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. కూరగాయల సాగుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ”రాష్ట్రంలో కూరగాయలు సాగు చేసే రైతులు అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల కేరళలో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేశాం. ఆ మాదిరిగానే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలి. మధ్య దళారీ వ్యవస్థను నివారించాలి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి. దీనిపై నెలరోజుల్లో నిర్దిష్టమైన ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’ అని కోదండరెడ్డి పేర్కొన్నారు.

Read More

అటవీ ఏనుగుల సమస్య పరిష్కారానికి ఆపరేషన్‌ కుంకీ

కుంకీ ఏనుగుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన తొలి ఆపరేషన్‌ విజయ వంతమైందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పరిధిలోని మొగిలి వద్ద మామిడితోటలు ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు విజయవంతంగా తరిమికొట్టాయని చెప్పారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కృష్ణ, జయంత్‌, వినాయక్‌ అనే కుంకీ ఏనుగులు పాల్గొనగా కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుగ్గా పాల్గొందని వివరించారు. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్‌ ద్వారా భరోసా కల్పించామని చెప్పారు. పుంగనూరు అటవీ ప్రాంతంలో తదుపరి ఆపరేషన్‌ చేపట్టనున్నట్లు చెప్పారు.

Read More