రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.

Read More

మార్కెటింగ్‌, మార్క్‌ ఫెడ్‌, హాకా, ఆర్‌ఐసి సంస్థల ఎండీలతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష

తెలంగాణా రాష్ట్రంలో వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణ, మరియు మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వరి ధాన్య సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు, మున్నగు వాటి జిల్లాల వారి లభ్యతపై సమీక్షించారు.
మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, ఐనప్పటికి రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు రేపటి నుండి మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాలు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సిసిఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. కావున వెంటనే కలెక్టర్లు జిన్నింగ్‌ సెంటర్లు రేపటిలోగా నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌ఓడీని అన్ని పంటల కొనుగోళ్లకు సమన్వయ అధికారిగా నియమించడం జరిగిందని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు ఎండి, వేర్‌ హౌజ్‌, వరంగల్‌ జిల్లాకు డైరెక్టర్‌, హార్టీకల్చర్‌, నల్లగొండ జిల్లాకు డైరెక్టర్‌, అగ్రికల్చర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ఎండి, హాకా, ఖమ్మం జిల్లాకు డైరెక్టర్‌ మార్కెటింగ్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు డైరెక్టర్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌, కరీంనగర్‌ జిల్లాకు ఎండి, ఆగ్రోస్‌, మెదక్‌ జిల్లాకు ఎండి, మార్క్‌ ఫెడ్‌, రంగారెడ్డి జిల్లాకు ఎండి, ఆయిల్‌ ఫెడ్‌ గార్ల స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, హాకా ఎండీ చంథ్రేఖర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More