ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి

గిడ్డంగుల సంస్థకు మంత్రి తుమ్మల ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కొత్త గోదాములను నిర్మించాలని, ఆహార ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు పెంచాలని గిడ్డంగుల సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థపై సమీక్ష నిర్వహించారు. సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”ఈ ఏడాది కొత్తగా 30,000 టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మరో 1,03,800 టన్నుల నిల్వ సామర్థ్యంతో 8 ప్రాంతాల్లో కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టాం. గోదాముల్లో సరకుల నిల్వ, రవాణా, వాహనాల రాకపోకలపై నిఘా ఏర్పాట్లు ప్రారంభించాం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాని సందర్భంలో అన్నదాతలు గోదాముల్లో సరకులను నిల్వ చేసుకోవాలి. సన్న, చిన్నకారు రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేస్తే వారికి 35 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన సరకు ద్వారా బ్యాంకులను నుంచి రుణాలు సైతం పొందవచ్చు” అని మంత్రి తెలిపారు.

Read More

అన్నదాతకు దక్కుతుంది 33 శాతమే

అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతులకు రూపాయిలో మూడోవంతు కూడా దక్కడం లేదని ఆర్‌బిఐకి నిపుణుల బృందం నివేదిక అందించింది. కూరగాయల ద్రవ్యోల్బణంపై.. రైతు నుంచి రిటైలర్‌ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కోసం అధ్యయనం చేసింది. రైతు నుంచి వ్యవసాయ మార్కెట్‌లో దిగుబడులు కొనుగోలు చేసే ట్రేడర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటెయిలర్ల కమీషన్లు, రవాణా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, నిల్వ ఛార్జీల రూపంలో ఖర్చులు ఎక్కువ అయ్యి ధరలు పెరిగి.. వినియోగదారునిపై భారం పడుతుంది. రైతు చేతికి దిగుబడి వచ్చినప్పటి నుంచి వినియోగదారుడిని చేరే వరకు అవసరమైన వాల్యూ చెయిన్‌ సరిగా లేకపోవడంతో దళారులు దోచుకోవడానికి అవకాశం ఏర్పడిందని నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిణామాల వలన అటు రైతూ, ఇటు వినియోగదారూ ఇద్దరూ నష్టాలే ఎదుర్కొంటున్నారు. కాబట్టి సరఫరా వ్యవస్థలోపాలను సరిచేయాలని సూచించారు.

Read More