ఆదుకుంటాం.. ఆందోళన చెందొద్దు

అకాల వర్షాలు, వడగళ్ల వానతో జరిగిన పంటనష్టంపై చంద్రబాబు సమీక్ష


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అకాలవర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అన్నదాతలెవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో జరిగిన పంటనష్టం, అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీరజంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం చంద్రబాబు సమీక్షించారు. రైతుల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ”వడగళ్ల వాన కారణంగా వైఎస్సార్‌, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లా లోని 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. 1,670 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1,364 మంది రైతులు నష్ట పోయారు” అని అధికారులు సీఎంకు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను పరిశీలించినట్లు నివేదించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యానశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.

Read More

అమరావతిలో పురుగుమందులు లేని ఆహారం అందేలా చూస్తాం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

ఒకసారి దావోస్‌లో మాట్లాడే సమయంలో గ్లోబల్‌ వార్మింగ్‌లో ప్రకృతి వ్యవసాయం కూడా ముఖ్యం అని చర్చ వచ్చింది. ఆ చర్చ సమయంలో ఏం చేయాలని ముందుచూపుతో ఆలోచించి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ గారిని పిలిపించి మాట్లాడి శిక్షణా తరగతులు నిర్వహించి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ విజయకుమార్‌ గారిని సిఈఓగా నియమించి, ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్టు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం అవలంభించే ప్రకృతి వ్యవసాయం చూడటానికి వస్తున్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు కాబోతున్నాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని చెప్పడం జరిగిందని, అమరావతిలో పురుగు మందులు లేని ఆహారాన్ని అందించేలా చూడటానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో ఉపన్యసించారు.

Read More

5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 19 జిల్లాలలో 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల మంది రైతులు రూ. 1244 కోట్ల మేర నష్టపోయారు. వరదల కారణంగా 2.03 లక్షల మంది రైతులకు చెందిన 4.6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిని రూ. 1104 కోట్ల విలువైన 4.80 లక్షల టన్నుల దాన్యం ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు అదనపు సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Read More

నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం

భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ముంపుకు గురైన పంటలను మంత్రి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా వ్యవసాయ, ఆక్వా రంగాలకు తీవ్ర నష్టం జరిగిందని ఈనెల 10లోగా పంట నష్టం లెక్కించి, అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి అన్నారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా పంట నష్టం జరిగిన ప్రతిరైతును ఆదుకుంటామని మంత్రి అన్నారు.

Read More

అరకు కాఫీ అద్భుతం

నరేంద్రమోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తరువాత మొదటిసారిగా ఏర్పాటు చేసిన ‘మన్‌-కీ-బాత్‌’ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ అరకు కాఫీ అద్భుతం అన్నారు. దేశీయంగా తయారవుతున్న అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతుంది. కాబట్టి అరకు కాఫీ రుచి గురించి ప్రపంచ దేశాలు సందర్శిస్తున్న సందర్భంలో విదేశీ ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోడి ప్రస్తావిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచి రుచి, సువాసనకు అరకు కాఫీ పెట్టింది పేరు. సుమారు లక్షాయాభైవేల గిరిజన కుటుంబాలు మమేకమయిన మన అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొండం మన అదృష్టం. ఇప్పటికే అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్‌ అవార్డులు లభించాయి. 2016లో ఒకసారి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి అరకు కాఫీ రుచి చూసే అవకాశం దొరికింది. రుచి అద్భుతంగా ఉంది అని మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
అరకు కాఫీ గురించి ప్రధాని మోడి ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందించి, ప్రధానితో కలిసి మరోసారి అరకు కాఫీ రుచిని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Read More