ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మినుము సాగు, ఉత్పత్తి పెంపుపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఏడు జిల్లాలకు సంబంధించి గురువారం విజయవాడలో జరిగిన ‘జాతీయ ఆహార, పోషక భద్రత మిషన్‌’ సదస్సులో మాట్లాడారు. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు.